News August 7, 2024
మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే EWS కోటా అమలు

AP: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే EWS కోటాలో 10శాతం సీట్ల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కొన్ని విద్యాసంస్థల్లోనే అమలు చేసినా NMC ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, పీజీ, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇది వర్తిస్తుంది. అయితే సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు వర్తించదని అధికారులు తెలిపారు.
Similar News
News October 24, 2025
కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా?

కళ్లజోడు ముఖానికి సరిపోదనో, కళ్ల రంగు మారిస్తే ఫ్యాషన్ అనో చాలామంది అమ్మాయిలు కాంటాక్ట్ లెన్స్ వాడుతుంటారు. అయితే వీటి వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. వీటిని సరిగా శుభ్రం చేయకపోయినా, వాడటంలో అజాగ్రత్తగా ఉన్నా కళ్లు పొడిబారటం, కార్నియా దెబ్బతినడం, కంటి ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు ఎదురవుతాయంటున్నారు. కాబట్టి స్టైల్తో పాటు ఆరోగ్యాన్నీ పట్టించుకోవాలని సూచిస్తున్నారు.
News October 24, 2025
ఇవాళ భారత్ బంద్

కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వ్యతిరేకిస్తూ ఇవాళ మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. అయితే దీనికి ప్రతిపక్ష పార్టీలు బహిరంగంగా ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. దీంతో ఇవాళ బంద్ వాతావరణం కొనసాగే అవకాశం కనిపించట్లేదు. స్కూళ్లు, కాలేజీలు యథాతథంగా నడవనున్నాయి. అటు షాపులు కూడా తెరిచే ఉండనున్నాయి.
News October 24, 2025
నేడు..

* ‘రోజ్గార్ మేళా’లో భాగంగా 51వేల మందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ
* దుబాయ్లో చంద్రబాబు మూడో రోజు పర్యటన.. సాయంత్రం 6.30 గంటలకు తెలుగు డయాస్పోరా సమావేశం
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల విత్డ్రాకు ఈ రోజు మాత్రమే ఛాన్స్.. 81 మంది నామినేషన్లకు అధికారులు ఆమోదం
* WWCలో తలపడనున్న పాకిస్థాన్, శ్రీలంక


