News August 7, 2024

మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే EWS కోటా అమలు

image

AP: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే EWS కోటాలో 10శాతం సీట్ల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కొన్ని విద్యాసంస్థల్లోనే అమలు చేసినా NMC ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, పీజీ, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇది వర్తిస్తుంది. అయితే సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు వర్తించదని అధికారులు తెలిపారు.

Similar News

News December 13, 2025

అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు

image

AP: అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌ దీపిక(సత్యసాయి), ప్లేయర్ పాంగి కరుణ (అల్లూరి) ఇళ్లలో Dy.CM పవన్ కళ్యాణ్ కాంతులు నింపారు. వారికి TV, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసరాలు, బట్టలు, దుప్పట్లు పంపించారు. క్రీడాకారుల కోటాలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తమ ఊరికి వెళ్లే 2 రోడ్లు ప్రయాణానికి యోగ్యంగా లేవని దీపిక చెప్పడంతో రూ.6.2 కోట్లతో రోడ్లను పవన్ <<18548703>>మంజూరు<<>> చేయడం తెలిసిందే.

News December 13, 2025

ఓటేయడానికి వెళ్తున్నారా.. జాగ్రత్త!

image

TG: రేపు పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉన్న విషయం తెలిసిందే. HYD, ఇతర ప్రాంతాల్లోని ఓటర్లు సొంతూళ్లకు ప్రయాణాలు చేస్తున్నారు. కొందరు బైకులపైనే వెళ్తుండటంతో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురై స్టేషన్‌ఘన్‌పూర్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరో ప్రమాదం మెదక్(D) పెద్దశంకరంపేటలో జరిగింది. బైక్‌పై వెళ్తున్న దంపతులు, వారి ఇద్దరు పిల్లలు చనిపోయారు.

News December 13, 2025

Nobel Prize: వేషం మార్చి, పడవల్లో వెళ్లి..

image

నోబెల్ అందుకునేందుకు వెనిజుల ప్రతిపక్ష నేత మరియా మచాడో పెద్ద సాహసమే చేశారు. బయట కనపడితే అరెస్ట్ చేద్దామనుకున్న ప్రభుత్వ కళ్లు గప్పి 3 రోజులు కష్టపడి నార్వేకు చేరుకున్నారు. US సైనిక నిపుణులు ‘ఆపరేషన్ గోల్డెన్ డైనమైట్’ చేపట్టి మచాడో వేషం మార్చి, పడవల్లో తీసుకెళ్లారు. డిజిటల్ ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. అయినా ఆలస్యం కావడంతో ఆమె కుమార్తె నోబెల్ పురస్కారాన్ని స్వీకరించారు.