News September 3, 2024
తుపాకీతో కాల్చుకుని ‘అట్లాస్’ మాజీ చీఫ్ ఆత్మహత్య

ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ ‘అట్లాస్’ మాజీ చీఫ్ సలీల్ కపూర్(70) ఢిల్లీలోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో కొందరు తనను వేధింపులకు గురిచేయడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు లేఖలో పేర్కొన్నారు. గతంలో ఆయన ఫ్యామిలీ మెంబర్ నటాషా ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1950లో అట్లాస్ను జానకీదాస్ కపూర్ స్థాపించగా 2020లో ఆర్థిక కారణాలతో మూతపడింది.
Similar News
News November 24, 2025
WGL: రీకౌంటింగ్.. తొలిసారి ఐదుగురు పాస్!

వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ చరిత్రలో రీకౌంటింగ్ పెడితే తొలిసారి ఫెయిలైన ఐదుగురు పీజీ వైద్య విద్యార్థులు మళ్లీ ఉత్తీర్ణులు కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ వైద్య కళాశాలలకు చెందిన ఈ విద్యార్థులు పాస్ కావడానికి, యూనివర్సిటీలో అక్రమంగా మార్కులు కలిపారని, డబ్బులు తీసుకొని పాస్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం గత నెల 4న ఫలితాలు విడుదలైనప్పటి నుంచి కొనసాగుతోంది.
News November 24, 2025
ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News November 24, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 710 తగ్గి రూ.1,25,130కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,14,700 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,71,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


