News March 28, 2024
మాజీ సీఎం కొడుకు ఆస్తులు రూ.700 కోట్లు.. సొంత కారు లేదట!

మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కొడుకు నకుల్ నాథ్ ఇటీవల ఛింద్వాడా నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అఫిడవిట్లో తన మొత్తం ఆస్తులను రూ.700 కోట్లుగా చూపించిన ఆయన.. సొంత కారు లేదని పేర్కొనడం గమనార్హం. గత ఐదేళ్లలో తన ఆస్తులు సుమారు రూ.40 కోట్లు పెరిగినట్లు వివరించారు. భార్య వద్ద కేవలం రూ.43వేల నగదు మాత్రమే ఉందని, తన తండ్రి కమల్నాథ్కు రూ.12లక్షల లోన్ ఇచ్చినట్లు వెల్లడించారు.
Similar News
News December 20, 2025
పేరెంట్స్ మర్చిపోవద్దు.. రేపే పల్స్ పోలియో!

AP: రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను తప్పక వేయించాలని ఇప్పటికే మంత్రి సత్యకుమార్ సూచించారు. రాష్ట్రంలోని 54,07,663 మంది చిన్నారులకు 38,267 బూత్లు ఏర్పాటు చేశారు. 61,26,120 డోస్లను జిల్లాలకు సరఫరా చేశారు. ఏదైనా కారణంతో రేపు పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందించనున్నారు.
News December 20, 2025
ఎద్దు అడుగులో ఏడు గింజలు పడితే పంట పలచన

నాగలితో దున్నుతూ విత్తనాలు వేసేటప్పుడు, ఎద్దు వేసే ఒక అడుగు దూరంలో ఏడు గింజలు పడ్డాయంటే అవి చాలా దగ్గర దగ్గరగా పడ్డాయని అర్థం. ఇలా విత్తనాలు మరీ దగ్గరగా మొలిస్తే మొక్కలకు గాలి, వెలుతురు సరిగా అందవు. నేలలోని పోషకాల కోసం మొక్కల మధ్య పోటీ పెరిగి ఏ మొక్కా బలంగా పెరగదు. ఫలితంగా పంట దిగుబడి తగ్గి పలచగా కనిపిస్తుంది. అందుకే పంట ఆశించిన రీతిలో పండాలంటే విత్తనాల మధ్య తగినంత దూరం ఉండాలని ఈ సామెత చెబుతుంది.
News December 20, 2025
శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి వెలిగిస్తే..?

శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి వెలిగించడం వల్ల వెలువడే సుగంధభరితమైన పొగ మానసిక ప్రశాంతతను ఇచ్చి, మనలోని సోమరితనాన్ని, ప్రతికూల ఆలోచనలను పారద్రోలుతుందని పండితులు చెబుతున్నారు. ‘ఆధ్యాత్మికంగా చూస్తే.. ఈ ధూపం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి ఈతిబాధలు తొలగిపోతాయి. అలాగే సకల దేవతల అనుగ్రహం లభించి, కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. మనసు ఉల్లాసంగా మారి పనుల పట్ల ఉత్సాహం పెరుగుతుంది’ అంటున్నారు.


