News June 25, 2024
మాజీ ఎంపీ ఎంవీవీకి హైకోర్టులో చుక్కెదురు

AP: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో చుక్కెదురైంది. హయగ్రీవ సంస్థకు చెందిన భూముల వ్యవహారంలో తనపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. కేసు ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ముందస్తు బెయిల్కు పిటిషన్ పెట్టుకోవాలని సూచించింది. విచారణను 2వారాలకు వాయిదా వేసింది.
Similar News
News January 23, 2026
భాగ్యనగరానికి మరో ‘అమృత్ భారత్’.. రూట్ మ్యాప్ ఇదే!

TG: చర్లపల్లి – తిరువనంతపురం మధ్య కొత్త అమృత్ భారత్ 2.0 ఎక్స్ప్రెస్ అందుబాటులోకి వస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. PM మోదీ శుక్రవారం దీన్ని వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ ప్రతి మంగళవారం ఉదయం 7.15కి చర్లపల్లిలో బయలుదేరి బుధవారం మధ్యాహ్నం కేరళ చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. అమృత్ భారత్లో RAC టికెట్లు ఉండవు.
News January 23, 2026
పెరటి కోళ్ల పెంపకం.. స్వర్ణధార కోళ్ల ప్రత్యేకత ఇదే

స్వర్ణధార కోళ్లు కూడా పెరటి కోళ్ల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి అధిక శరీర బరువును కలిగి ఉంటాయి. ఏడాదికి 190 వరకు గుడ్లను పెడతాయి. గుడ్లు, మాంసం ఉత్పత్తి కోసం ఎక్కవ మంది పెరటి కోళ్ల పెంపకానికి స్వర్ణధార కోళ్లను ఎంపిక చేసుకుంటారు. ఇవి 22 నుంచి 23 వారాల్లో సుమారు 3 నుంచి 4 కిలోల బరువు పెరుగుతాయి. వీటి గుడ్డు బరువు 50-60 గ్రాములుంటుంది. స్వర్ణధార కోళ్లకు గుడ్లు పొదిగే సామర్థ్యం 80-85%గా ఉంటుంది.
News January 23, 2026
రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

బెంగళూరులోని <


