News March 1, 2025
అదరగొడుతున్న మాజీలు.. మాస్టర్స్ లీగ్లో మరో సెంచరీ

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో మాజీలు అదరగొడుతున్నారు. మొన్న ఆస్ట్రేలియా ప్లేయర్ వాట్సన్ సెంచరీతో చెలరేగగా ఇవాళ శ్రీలంక ఆటగాడు ఉపుల్ తరంగ శతకం బాదారు. ఆసీస్తో జరిగిన మ్యాచ్లో అతడు 53 బంతుల్లోనే 102 రన్స్తో చెలరేగారు. ఇందులో 6 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో లంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన AUS 217 రన్స్ చేయగా శ్రీలంక మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
Similar News
News November 22, 2025
జల, వాయు మార్గాల ద్వారా భారత్-అఫ్గాన్ ట్రేడ్

భారత్-అఫ్గాన్ మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి. పాక్ రోడ్డు మార్గం మూసేయడంతో జల, వాయు మార్గాల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఇరాన్లోని చాబహార్ ఓడరేవుతోపాటు రెండు ప్రత్యేక కార్గో విమానాలను ఉపయోగించుకోనున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం IND-AFG మధ్య బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుండగా, భవిష్యత్తులో మరింత పెంచనున్నాయి.
News November 22, 2025
పత్తి రైతుకు దక్కని మద్దతు ధర

మద్దతు ధర విషయంలో పత్తి రైతులకు కష్టాలు తప్పడం లేదు. క్వింటా పత్తి పొట్టి పింజ రూ.7,710, పొడవు పింజ రూ.8110 మద్దతు ధరగా ప్రకటించినా.. నిబంధనల వల్ల ఆ ధర దక్కే పరిస్థితి కనిపించడం లేదు. తేమ ఉందని, రంగు మారిందని కొనుగోలు కేంద్రాల్లో తక్కువ ధరే ఇస్తున్నారు. గ్రామాల్లో కొందరు వ్యాపారులు క్వింటా పత్తిని రూ.5వేలు నుంచి రూ.6వేలకే అడుగుతున్నారు. దీంతో తమకు పెట్టుబడి కూడా దక్కట్లేదని రైతులు వాపోతున్నారు.
News November 22, 2025
శుక్ర మౌఢ్యమి.. 83 రోజులు ఈ శుభకార్యాలు చేయొద్దు: పండితులు

ఈ నెల 26 నుంచి వచ్చే ఏడాది FEB 17 వరకు(83 రోజులు) శుక్ర మౌఢ్యమి ఉందని పండితులు వేదస్మార్త గురురాజుశర్మ తెలిపారు. ‘శుభాలకు అధిపతులైన గురు, శుక్రుడు ఈ మూఢాల్లో సూర్యుడికి సమీపంగా రావడంతో శక్తిని కోల్పోతాయి. ఈ రోజుల్లో వివాహం, గృహప్రవేశాలు, వాహనాల కొనుగోళ్లు, బోర్లు తవ్వించడం, పుట్టువెంట్రుకలు తీయడం, యాత్రలకు వెళ్లడం వంటివి చేయొద్దు. నిత్యారాధన, సీమంతాలకు ఈ దోషం వర్తించదు’ అని పేర్కొన్నారు.


