News September 18, 2024
మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్: నారా లోకేశ్
AP: మాజీ సైనికుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. యువగళం పాదయాత్రలో సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినట్లుగానే ఆయన హామీ నెరవేర్చారు. ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో దీనిపై తీర్మానం చేశారు. ఇంకా నెరవేర్చాల్సిన హామీలపై ఆయన వివిధ శాఖల మంత్రులతో చర్చలు జరుపుతున్నారు.
Similar News
News September 19, 2024
‘లారెన్స్ బిష్ణోయ్ని పిలవాలా?’.. సల్మాన్ తండ్రిని బెదిరించిన మహిళ
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ను ఓ మహిళ బెదిరించింది. ముంబైలోని కార్టర్ రోడ్డులో మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్పై వచ్చిన ఓ వ్యక్తి, మహిళ ఆయనను అడ్డగించారు. ‘లారెన్స్ బిష్ణోయ్ని పిలవాలా?’ అంటూ ఆమె బెదిరించింది. పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. కాగా, కామెడీగా అలా అన్నట్లు వారు తెలిపారు. గతంలో సల్మాన్ఖాన్ను చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నించిన విషయం తెలిసిందే.
News September 19, 2024
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇద్దరు మృతి
TG: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. గోవా నుంచి వచ్చిన నితిన్ షా, జెడ్డా నుంచి వచ్చిన సకీనా అస్వస్థతకు గురై ఎయిర్పోర్టులోనే కుప్పకూలారు. సిబ్బంది వారిని అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వారిద్దరూ మృతి చెందారు.
News September 19, 2024
రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త కార్యక్రమం
AP: రేపటి నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 20 నుంచి 6 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించేలా MLAలు వారి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం రాజాపురం గ్రామంలో పర్యటించనున్నారు.