News September 14, 2024

ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష.. ఇంటర్నెట్ నిలిపివేత!

image

అస్సాంలో గ్రేడ్-3 ప్రభుత్వ ఉద్యోగాలకు రేపు ఉ.10 గంటల నుంచి మ.1:30 గంటల వరకు నియామక పరీక్ష జరగనుంది. దీంతో పరీక్ష జరిగే సమయంలో అన్ని ఎగ్జామ్ సెంటర్ల పరిధిలో ఇంటర్నెట్‌ను ప్రభుత్వం నిలిపివేయనుంది. 28 జిల్లాల్లో 2,305 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మోసానికి పాల్పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గతంలోనూ పరీక్షల సమయంలో ప్రభుత్వం ఇలానే ఇంటర్నెట్ నిలిపివేసింది.

Similar News

News November 27, 2025

మీ ఇంట్లో ‘దక్షిణామూర్తి’ చిత్రపటం ఉందా?

image

శివుడి జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి. ఇంట్లో ఆయన చిత్రపటం ఉంటే అది సకల శుభాలు, అష్టైశ్వర్యాలకు మార్గమని పండితులు, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అపమృత్యు దోషాలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు ఆయనను ఆరాధిస్తారు. దక్షిణామూర్తి దర్శనంతో పిల్లల్లో విద్యా బుద్ధులు వికసించి, జ్ఞానం, ఏకాగ్రత సిద్ధిస్తాయని నమ్మకం.
☞ దక్షిణామూర్తి విగ్రహాన్ని ఇంట్లో ఏ రోజున ప్రతిష్ఠించాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 27, 2025

TGTET-2026.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

TGTET-2026కు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. D.EL.Ed, B.EL.Ed, D.Ed, B.Ed, B.A.Ed / B.Sc.Ed కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 1-8వ తరగతి వరకు బోధించడానికి టెట్ అర్హత తప్పనిసరి. జనవరి 3 నుంచి జనవరి 31 వరకు CBT విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఒకసారి టెట్ ఉత్తీర్ణులైతే లైఫ్‌టైమ్ వాలిడిటీ ఉంటుంది. వెబ్‌సైట్: https://tgtet.aptonline.in/tgtet/

News November 27, 2025

దక్షిణామూర్తి చిత్రపటాన్ని ఇంట్లో ఏ రోజున ప్రతిష్ఠించాలి?

image

దక్షిణామూర్తి చిత్రపటాన్నిగురువారం రోజున ఇంట్లో ప్రతిష్ఠిస్తే సకల శుభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. గురు గ్రహ ప్రభావం అధికంగా ఉండే ఈరోజున జ్ఞాన స్వరూపుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే విద్యాభివృద్ధి పెరుగుతుందని అంటున్నారు. ‘శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, పండుగ రోజులలో విగ్రహ స్థాపన చేయవచ్చు. నిష్ణాతులైన పండితుల సలహా మేరకు ప్రతిష్ఠించడం మరింత శ్రేయస్కరం’ అని చెబుతున్నారు.