News February 22, 2025
ఉత్కంఠ: గ్రూప్-2పై APPSC ఏం చేస్తుందో..?

AP: గ్రూప్-2 వాయిదా వేయాలని ప్రభుత్వం రాసిన <<15544005>>లేఖపై<<>> APPSC నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని, పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అలాగే ఈ అంశంపై మార్చి 11న హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని అప్పటివరకు పరీక్షలు నిర్వహించవద్దని ప్రభుత్వం కోరింది. దీనిపై APPSC అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Similar News
News November 20, 2025
ఎదురుపడ్డా పలకరించుకోని జగన్-సునీత!

అక్రమ ఆస్తుల కేసులో AP మాజీ సీఎం జగన్ ఇవాళ HYD నాంపల్లి CBI కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన బాబాయి వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా కోర్టులోనే ఉన్నారు. తన తండ్రి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని దాఖలు చేసిన పిటిషన్ వాదనల నేపథ్యంలో ఆమె న్యాయస్థానానికి హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలో అన్నాచెల్లెళ్లు ఎదురు పడినా ఒకరినొకరు పలకరించుకోలేదని, ఎవరో తెలియనట్లు వ్యవహరించినట్లు సమాచారం.
News November 20, 2025
ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రానికి స్థలం: CM

TG: ఈశాన్య రాష్ట్రాలతో సత్సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. HYDలో జరిగిన తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీలో ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం’ నిర్మించడానికి భూమి కేటాయిస్తామని ప్రకటించారు. TG సోదరుడు త్రిపుర గవర్నర్(ఇంద్రసేనా రెడ్డి)గా, త్రిపుర సోదరుడు TG గవర్నర్గా పనిచేస్తున్నారని CM అన్నారు.
News November 20, 2025
ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రానికి స్థలం: CM

TG: ఈశాన్య రాష్ట్రాలతో సత్సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. HYDలో జరిగిన తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీలో ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం’ నిర్మించడానికి భూమి కేటాయిస్తామని ప్రకటించారు. TG సోదరుడు త్రిపుర గవర్నర్(ఇంద్రసేనా రెడ్డి)గా, త్రిపుర సోదరుడు TG గవర్నర్గా పనిచేస్తున్నారని CM అన్నారు.


