News April 30, 2024
నంద్యాలలో ఉత్కంఠ పోరు!

AP: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు నెలకొంది. వైసీపీ యువ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి, టీడీపీ నుంచి సీనియర్ మైనార్టీ నేత ఎన్ఎండీ ఫరూక్ ప్రజాక్షేత్రంలో ఢీకొంటున్నారు. గతంలో ఇక్కడ మూడు సార్లు గెలిచిన ఫరూక్ మంత్రిగాను చేశారు. ఇద్దరు నేతలు తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులు, పథకాలను ప్రస్తావిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముస్లిం ఓట్లు ఇక్కడ కీలకంగా మారనున్నాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 29, 2026
రేపు రాలేను, ఎర్రవల్లి ఫాంహౌస్కు రండి: కేసీఆర్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ బదులిచ్చారు. ముందే షెడ్యూల్ అయిన మున్సిపల్ ఎలక్షన్ కార్యక్రమాల వల్ల రేపు విచారణకు హాజరు కాలేనని పోలీసులకు తెలిపారు. మరో తేదీన తనను ఎర్రవల్లి ఫాంహౌస్లోనే విచారించాలని విచారణ అధికారిని కోరారు. మాజీ సీఎంగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని తెలిపారు. భవిష్యత్తులో జారీ చేసే నోటీసులను కూడా ఎర్రవల్లికే పంపాలని పేర్కొన్నారు.
News January 29, 2026
ప్రధానిగా మోదీనే బెస్ట్: ఇండియా టుడే సర్వే

భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55 శాతం మంది భావించినట్లు Mood of the Nation సర్వేలో ఇండియా టుడే వెల్లడించింది. 6 నెలల కిందటితో పోలిస్తే 3% పెరిగినట్లు తెలిపింది. మోదీ పనితీరుపై 57% మంది సంతృప్తి వ్యక్తం చేశారని, గుడ్ రేటింగ్ ఇచ్చారని వివరించింది. యావరేజ్ అని 16%, పూర్ అని 24% మంది అభిప్రాయపడ్డారని చెప్పింది. మరోవైపు బెస్ట్ సూటెడ్ PM అంటూ రాహుల్ గాంధీ వైపు 27% మంది మొగ్గు చూపినట్లు పేర్కొంది.
News January 29, 2026
పాకిస్థాన్కు అంత దమ్ము లేదు: రహానే

T20 ప్రపంచ కప్ను బాయ్కాట్ చేస్తామంటూ బెదిరిస్తున్న పాకిస్థాన్పై భారత క్రికెటర్ అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ అలా చేస్తుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఆ జట్టుకు అంత దమ్ము లేదన్నారు. టోర్నీ ఆడేందుకు పాక్ వస్తుందని అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ కోసం శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు పాకిస్థాన్ టీమ్ టికెట్లు బుక్ <<18990370>>చేసుకున్నట్లు<<>> వార్తలు రావడం తెలిసిందే.


