News December 12, 2024

EPFO ఖాతాదారులకు అదిరిపోయే న్యూస్

image

EPFO ఖాతాదారులు తమ PF సొమ్మును ATM నుంచి విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. 2025 జనవరి నుంచే ఈ సేవలు ప్రారంభం అవుతాయని అధికార వర్గాల సమాచారం. తమ సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి సుమిత దావ్రా చెప్పారు. 2-3 నెలల్లో భారీ మార్పులు చూస్తారని తెలిపారు. ఈ నిర్ణయంతో కార్మికుల క్లెయిమ్‌లు వేగంగా పరిష్కారం అవుతాయని కేంద్రం భావిస్తోంది.

Similar News

News November 28, 2025

పెద్దపల్లిలో దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడలు

image

పెద్దపల్లి కలెక్టరేట్ పరేడ్‌గ్రౌండ్‌లో దివ్యాంగుల కోసం జిల్లా స్థాయి క్రీడలను ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ వేణు, ఎఫ్ ఆర్ ఓ స్వర్ణలత, డీడబ్ల్యూఓ ఇంచార్జ్ కవిత, రామగుండం సీడీపీఓ అలేఖ్య పటేల్ తదితర అధికారులు ప్రారంభించారు. చెస్, క్యారమ్స్, జావెలిన్, రన్నింగ్, షాట్‌పుట్ విభాగాల్లో 300 మంది వికలాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డబ్ల్యూసీడీ & ఎస్సీ శాఖ సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

News November 28, 2025

వింత ఆచారం.. అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలు

image

తెలంగాణ వినూత్న ఆచారాలకు నిలయం. ఇక్కడ ప్రాంతాలను బట్టి ఆచారాలు, ఆహారపు అలవాట్లూ మారుతుంటాయి. అలాంటి ఓ ఆచారం ప్రకారం పెళ్లిలో అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలను వాడటం కొన్నిచోట్ల కనిపిస్తుంది. జొన్నలను కొన్ని వర్గాల ప్రజలు బియ్యం కంటే పవిత్రంగా భావించి అక్షింతలుగా వాడతారట. ఆదిలాబాద్, వికారాబాద్, వెస్ట్ రంగారెడ్డి ప్రాంతాల్లోని పలు చోట్ల ఇది కనిపిస్తుంది. మీ ప్రాంతంలో ఈ ఆచారం ఉందా?COMMENT

News November 28, 2025

భారీ వర్షసూచన.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

AP: దిత్వా తుఫానుతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం, ప్రకాశం, బాపట్ల 20 CMకు పైగా వర్షపాతం నమోదవుతుందన్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?