News October 25, 2024
IPL ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్
IPL రిటెన్షన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మంచి కిక్కిచ్చే న్యూస్. ఈ నెల 31వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు రిటెన్షన్ షో ప్రారంభం అవుతుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. జియో సినిమాలో దీనికి సంబంధించి లైవ్ ప్రసారం అవుతుంది. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను ఆయా జట్లు ఆ రోజున ప్రకటించనున్నాయి. మీ అభిమాన జట్టు ఏ ప్లేయర్ను రిటెయిన్ చేసుకుంటుందని మీరు అంచనా వేస్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News October 25, 2024
తిరుమల నడక దారిన వెళ్లే వారికి TTD కీలక సూచనలు
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, షుగర్, హై BP, గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బసం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నడక దారిన రావడం మంచిది కాదని తెలిపింది. తిరుమల కొండ చాలా ఎత్తులో ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తిరుమలలో 24 గంటలూ వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని, భక్తులు సహకరించాలని కోరింది.
News October 25, 2024
యశస్వీ జైస్వాల్ అరుదైన ఘనత
టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఒక క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో 1,000 పరుగులు పూర్తి చేసుకున్న యంగెస్ట్ ఇండియన్ బ్యాటర్గా జైస్వాల్ (22 ఏళ్లు) చరిత్ర సృష్టించారు. కివీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆయన ఈ ఫీట్ సాధించారు. గతంలో ఈ రికార్డు దిలీప్ వెంగ్సర్కార్ (23 ఏళ్లు, 1979) పేరిట ఉండేది. 45 ఏళ్ల తర్వాత దిలీప్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టారు.
News October 25, 2024
కాంగ్రెస్ వచ్చింది-కష్టాలు తెచ్చింది: కేటీఆర్
TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దద్దమ్మ పాలనలో రాష్ట్రం ధర్నాలతో దద్దరిల్లుతోందని మండిపడ్డారు. మూలకున్న ముసలవ్వ నుంచి బడిపిల్లల దాకా అన్ని వర్గాల వారు నిరసనలు చేస్తున్నారని పేర్కొన్నారు. అంతా కాంగ్రెస్ పాలన వద్దని నినదిస్తున్నారని ట్విటర్(X)లో రాసుకొచ్చారు.