News December 3, 2024

EXCLUSIVE: ఇంటర్ విద్యార్థులకు GOOD NEWS

image

AP: ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్ నిర్ణయించారు. టెన్త్ తర్వాత డ్రాపౌట్స్ పెరుగుతుండటంతో భోజన సౌకర్యంతో ఈ సంఖ్య తగ్గించవచ్చని అధికారులతో సమీక్షలో పేర్కొన్నారు. అటు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. AP, TGలో ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే మిడ్ డే మీల్ ఉంది.

Similar News

News November 16, 2025

మెంటార్‌ని ఎంచుకుంటున్నారా?

image

మీరు రాణించాలనుకొనే రంగంలో సీనియర్లను మెంటార్‌గా ఎంచుకొనే ముందు వారు నిజంగా మీకు మార్గం చూపించడానికి తగిన వారేనా అన్నది గుర్తించాలి. వారిలో ఏ అంశం మిమ్మల్ని ప్రభావితం చేస్తుందో గమనించాలి. అపజయాలు పొందిన వాళ్లనీ మార్గదర్శకుడిగా ఎన్నుకుంటే వారి తప్పుల గురించి తెలుసుకోవచ్చు. మెంటార్ శభాష్ అని వెన్ను తట్టడమే కాకుండా, తప్పు చేస్తున్నప్పుడు నిర్మొహమాటంగా తగదని మందలించే వారై ఉండాలి.

News November 16, 2025

రేషన్ కార్డు ఉంటేనే..

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంటును పెద్దఎత్తున అనర్హులు పొందుతున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌కమ్ సర్టిఫికెట్ దరఖాస్తుకు రేషన్ కార్డును లింక్ చేసింది. అంటే ఇకపై రేషన్ కార్డు ఉంటేనే ఆదాయ ధ్రువీకరణ పత్రం వస్తుంది. మీసేవ సెంటర్లలో రేషన్ కార్డులు లేని వారు అప్లై చేస్తే ‘మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు’ అని మెసేజ్ వస్తుంది. దీంతో అనర్హులకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

News November 16, 2025

అదరగొట్టిన IND బౌలర్లు.. 132 పరుగులకే SA-A ఆలౌట్

image

రాజ్‌కోట్ వేదికగా ఇండియా-Aతో జరుగుతోన్న రెండో అనధికార వన్డేలో సౌతాఫ్రికా-A 132 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో రివాల్డో మూన్‌సామి (33) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో నిశాంత్ సింధు 4, హర్షిత్ రాణా 3, ప్రసిద్ధ్ 2 వికెట్లు పడగొట్టగా తిలక్ వర్మ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే ఇండియా-A 50 ఓవర్లలో 133 రన్స్ చేయాలి. కాగా తొలి వన్డేలో IND-A గెలిచిన విషయం తెలిసిందే.