News August 1, 2024
ఉచిత గ్యాస్ సిలిండర్లపై కసరత్తు

AP: మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రంలో 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉండగా, అందులో దీపం పథకానికి అర్హులైనవారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ ఉంటే పథకం అందదని తెలుస్తోంది. కరెంట్ బిల్స్, ఆధార్తో లింకైన ఫోన్ నంబర్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అర్హులను గుర్తిస్తారని సమాచారం.
Similar News
News February 10, 2026
బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. కాంగ్రెస్పై ఆరోపణలు

TG: నారాయణపేట(D) మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డుకు పోటీ చేస్తున్న BJP అభ్యర్థి మహదేవప్ప సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. నిన్నటివరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఉరివేసుకుని చనిపోయారు. పోటీ నుంచి తప్పుకోవాలని ప్రత్యర్థి నాయకులు ఆయన్ను వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంత్రి శ్రీహరి, ఆయన అనుచరుల వేధింపులే మహదేవప్ప మరణానికి కారణమని T BJP చీఫ్ రాంచందర్ రావు ఆరోపించారు.
News February 10, 2026
కిలో టమాటా రూ.5.. రైతుల ఆవేదన

AP: టమాటా ధరలు రోజురోజుకీ పడిపోతుండటంతో రైతు కన్నీరు పెడుతున్నాడు. తాజాగా కర్నూల్ జిల్లా ఆస్పరి, హొళగుందలో కేజీ టమాటా ధర రూ.5కి పడిపోయింది. దీంతో రైతులు టమాటాను రోడ్లపైనే పడేస్తున్నారు. రవాణా ఖర్చులు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు పత్తికొండలో ఇప్పటికే కొనుగోళ్లు నిలిచిపోయాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ధరలు ఇంచుమించుగా ఇలాగే ఉన్నాయని రైతులు చెబుతున్నారు.
News February 10, 2026
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 202 పాయింట్లు పుంజుకొని 84,267 వద్ద.. నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 25,917 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, NTPC షేర్లు లాభాల్లో.. బజాజ్ ఫైనాన్స్, HCL టెక్, ఇండిగో, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన సూచీలను ప్రభావితం చేస్తున్నాయి.


