News October 23, 2024
మధ్యాహ్న భోజనం మెనూ మార్పుపై కసరత్తు

AP: పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం మెనూలో మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. కొన్ని రకాల వంటకాలను పిల్లలు తినడం లేదని అందిన ఫీడ్ బ్యాక్ మేరకు చర్యలు చేపట్టింది. వంటలు చేసే ఏజెన్సీలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోనుంది. జిల్లాల వారీగా మెనూని తీసుకురావాలా? లేదా ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో మెనూని అమలు చేయాలా? అనే దానిపై కసరత్తు చేస్తోంది.
Similar News
News December 15, 2025
వెజైనల్ ఇన్ఫెక్షన్స్తో ప్రెగ్నెన్సీకి ఇబ్బంది

మహిళల్లో వైట్ డిశ్చార్జ్ రంగు మారినా, వెజైనా పొడిబారి మంట, దురద వస్తూ స్పాటింగ్ కనిపిస్తున్నా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే. అయితే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి. దాంతో పిండం గర్భాశయంలోకి వెళ్లదు. దాన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. దీన్ని గుర్తించకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్ పగిలి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఏవైనా ఇన్ఫెక్షన్లు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
News December 15, 2025
ఇది తమిళనాడు.. తలవంచబోం: స్టాలిన్

తమ తర్వాతి టార్గెట్ తమిళనాడేనని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు CM స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ BJP ఎప్పటికీ గెలవలేదన్నారు. ‘ఇది తమిళనాడు. మా క్యారెక్టర్ను మీరు అర్థం చేసుకోలేరు. ప్రేమతో వస్తే ఆలింగనం చేసుకుంటాం. అహంకారంతో వస్తే తలవంచం. మిమ్మల్ని నేరుగా ఎదుర్కొని ఓడిస్తాం’ అని స్పష్టం చేశారు. BJP గెలవలేని ఏకైక రాష్ట్రం తమిళనాడు అని, అందుకే అమిత్ షా చిరాకు పడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 15, 2025
అశ్వినీ వైష్ణవ్తో లోకేశ్ భేటీ

AP: విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో భేటీ అయ్యారు. స్కిల్ అసెస్మెంటులో AI టెక్నాలజీ ఆధారిత పోర్టల్, పైలెట్ ప్రాజెక్టు అమలు గురించి వివరించారు. రాష్ట్ర నైపుణ్య గణనకు సహకరించాలని కోరారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో InnoXR యానిమేషన్, ఇమ్మర్సివ్ టెక్నాలజీస్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు తోడ్పడాలన్నారు. మరో కేంద్ర మంత్రి జయంత్ చౌదరితోనూ లోకేశ్ సమావేశమయ్యారు.


