News October 23, 2024

మధ్యాహ్న భోజనం మెనూ మార్పుపై కసరత్తు

image

AP: పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం మెనూలో మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. కొన్ని రకాల వంటకాలను పిల్లలు తినడం లేదని అందిన ఫీడ్ బ్యాక్ మేరకు చర్యలు చేపట్టింది. వంటలు చేసే ఏజెన్సీలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోనుంది. జిల్లాల వారీగా మెనూని తీసుకురావాలా? లేదా ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో మెనూని అమలు చేయాలా? అనే దానిపై కసరత్తు చేస్తోంది.

Similar News

News March 16, 2025

OTD: సచిన్ సెంచరీల సెంచరీ

image

సచిన్ టెండూల్కర్ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించి నేటికి 13 ఏళ్లు అయింది. మార్చి 16, 2012లో బంగ్లాపై సెంచరీ చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచారు. సచిన్ 99 సెంచరీలు చేసి 100 శతకాలు పూర్తి చేయడానికి ఏడాదికి పైగా (369రోజులు) సమయం పట్టింది. ఇప్పటి వరకు మాస్టర్ బ్లాస్టర్ రికార్డ్ చెక్కుచెదరకపోగా, యాక్టివ్ ప్లేయర్లలో కోహ్లీ(82) ఒక్కరే ఆ మైలురాయికి దగ్గర్లో ఉన్నారు.

News March 16, 2025

ట్యాంక్ బండ్‌పై ఆంధ్రుల విగ్రహాలు తొలగించే దమ్ముందా: బండి

image

TG: పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఆయన గొప్ప దేశభక్తుడని, ఏపీ మూలాలుంటే పేర్లను మార్చేస్తారా అని నిలదీశారు. NTR, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లను కూడా మారుస్తారా అని అన్నారు. ట్యాంక్ బండ్‌పై ఆంధ్రుల విగ్రహాలు తొలగించే దమ్ముందా అని ప్రశ్నించారు. తక్షణమే చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు.

News March 16, 2025

ఆస్పత్రిలో సమంత.. అభిమానుల ఆందోళన

image

హీరోయిన్ సమంత మరోసారి ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటోను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సామ్‌కు మళ్లీ ఏమైంది, ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటూ టెన్షన్ పడుతున్నారు. కాగా సమంత కొంత కాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. సమంత ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్’ చిత్రంలో నటిస్తున్నారు.

error: Content is protected !!