News October 23, 2024

మధ్యాహ్న భోజనం మెనూ మార్పుపై కసరత్తు

image

AP: పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం మెనూలో మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. కొన్ని రకాల వంటకాలను పిల్లలు తినడం లేదని అందిన ఫీడ్ బ్యాక్ మేరకు చర్యలు చేపట్టింది. వంటలు చేసే ఏజెన్సీలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోనుంది. జిల్లాల వారీగా మెనూని తీసుకురావాలా? లేదా ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో మెనూని అమలు చేయాలా? అనే దానిపై కసరత్తు చేస్తోంది.

Similar News

News October 23, 2024

‘దానా’ తుఫాను.. ఆ పేరెవరు పెట్టారంటే?

image

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుఫాను వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే హెచ్చరించింది. ఆ తుఫానుకు దానా అని నామకరణం చేసిన దేశం ఖతర్. ప్రపంచ వాతావరణ సంస్థ(WMO) రూపొందించిన ఉష్ణమండల తుఫాను నామకరణ విధానం ప్రకారం ఖతర్ ఈ పేరు పెట్టింది. దానా అనే పదానికి అరబిక్‌లో ‘ఉదారత’ అని అర్థం.

News October 23, 2024

రూ.1,000 కోట్ల పెట్టుబడులు.. 12,500 మందికి ఉపాధి: ప్రభుత్వం

image

AP: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో డ్రోన్ హబ్ ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ డ్రోన్ రంగంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు, 12,500 మందికి ఉపాధి కల్పించేలా ముసాయిదా డ్రోన్ పాలసీని ప్రకటించింది. దీనిపై కూటమి పార్టీలు, నిపుణుల సూచనలు తీసుకొని అవసరమైతే మార్పులు చేస్తామంది. నవంబర్ వరకు ఫైనల్ పాలసీని తీసుకొస్తామని చెప్పింది.

News October 23, 2024

2 రోజుల్లోనే ఖాతాల్లోకి గ్యాస్ డబ్బులు: TDP

image

AP: దీపావళి నుంచి ప్రారంభించే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై TDP కీలక ప్రకటన చేసింది. ‘ఏటా 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తారు. ఈ నెల 24 నుంచి బుకింగ్ మొదలవుతుంది. 31 నుంచి సరఫరా చేస్తారు. ఒక్కో సిలిండర్‌పై రూ.851 రాయితీ ప్రభుత్వం చెల్లిస్తుంది. 2 రోజుల్లోనే వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది’ అని ఓ ఫొటోను పంచుకుంది. అటు ఇవాళ్టి క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయనుంది.