News October 23, 2024

మధ్యాహ్న భోజనం మెనూ మార్పుపై కసరత్తు

image

AP: పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం మెనూలో మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. కొన్ని రకాల వంటకాలను పిల్లలు తినడం లేదని అందిన ఫీడ్ బ్యాక్ మేరకు చర్యలు చేపట్టింది. వంటలు చేసే ఏజెన్సీలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోనుంది. జిల్లాల వారీగా మెనూని తీసుకురావాలా? లేదా ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో మెనూని అమలు చేయాలా? అనే దానిపై కసరత్తు చేస్తోంది.

Similar News

News November 10, 2025

ప్రెగ్నెంట్లు పారాసిటమాల్ వాడొచ్చు: సైంటిస్టులు

image

గర్భిణులు పారాసిటమాల్ వాడితే పిల్లలకు ఆటిజమ్/ADHD వస్తుందనే వాదనకు ఆధారాలు లేవని బ్రిటిష్ మెడికల్ జర్నల్ వెల్లడించింది. ప్రెగ్నెంట్లు పారాసిటమాల్/ఎసిటమినోఫెన్ లాంటి పెయిన్ కిల్లర్లు వాడొద్దని ఇటీవల ట్రంప్ పిలుపునివ్వడంతో సైంటిస్టులు పరిశోధన చేశారు. ‘ప్రెగ్నెన్సీలో హై ఫీవర్ బిడ్డపై ప్రభావం చూపుతుంది. పారాసిటమాల్ సురక్షితమైన డ్రగ్. కచ్చితంగా తీసుకోవచ్చు’ అని WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య తెలిపారు.

News November 10, 2025

స్పీకర్‌పై BRS కోర్టు ధిక్కార పిటిషన్

image

TG: ఫిరాయింపు MLAలపై నిర్దేశించిన 3 నెలల గడువులోగా చర్యలు తీసుకోలేదని TG స్పీకర్‌పై BRS పార్టీ న్యాయవాది మోహిత్‌రావు SCలో ధిక్కార పిటిషన్ వేశారు. అత్యవసరంగా దీనిపై విచారించాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈనెల 23న ప్రస్తుత CJI రిటైర్ అవుతారని, కొత్త CJI వస్తే మొదట్నుంచి విచారించాల్సి ఉంటుందని వివరించారు. వచ్చే సోమవారం విచారిస్తామని జస్టిస్ గవాయ్ చెప్పారు.

News November 10, 2025

సంక్రాంతికి ఊరెళ్తున్నారా? రైల్వే టికెట్ బుకింగ్స్ మొదలు!

image

వచ్చే సంక్రాంతికి (జనవరి 2026) ఊళ్లకు వెళ్లాలనుకునేవారికి అలర్ట్. భారతీయ రైల్వే టికెట్ బుకింగ్స్ 60 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. ఇవాళ జనవరి 9వ తేదీవి, రేపు JAN 10, ఎల్లుండి JAN 11, గురువారం రోజున జనవరి 12వ తేదీకి సంబంధించిన టికెట్లు రిలీజ్ కానున్నాయి. సొంతూళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండి IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ ద్వారా వెంటనే బుక్ చేసుకోవచ్చు. SHARE IT