News March 23, 2024

బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

image

ఏపీ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరి, సోము వీర్రాజు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై అధిష్ఠానం పెద్దలతో చర్చిస్తున్నారు. ఇప్పటికే 10 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లలో పోటీ చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. అయితే కొన్ని స్థానాల్లో టీడీపీ, బీజేపీ మధ్య పంచాయితీ ఇంకా తేలలేదు. ఇవాళ ఆ సీట్లపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Similar News

News October 22, 2025

సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో హార్దిక్ పాండ్య!

image

ఆసియా కప్ సమయంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయంతో హార్దిక్ పాండ్య టీమ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌కు కూడా అతను విశ్రాంతిలోనే ఉన్నారు. అయితే హార్దిక్ కోలుకున్నారని, సౌత్ ఆఫ్రికాతో జరగబోయే సిరీస్‌కి అందుబాటులో ఉంటారని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. SA జట్టు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 19 వరకు 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల కోసం భారత్‌లో పర్యటించనుంది.

News October 22, 2025

ఇందిరమ్మ ఇళ్లపై మరో గుడ్‌న్యూస్

image

TG: 60 చదరపు గజాల కంటే తక్కువ స్థలం ఉంటే జీ+1 తరహాలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పట్టణ ప్రాంతాలవారికి ఈ ఆప్షన్ ఇచ్చింది. రెండు గదులతో పాటు కిచెన్, బాత్రూమ్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. గ్రౌండ్ ఫ్లోర్ స్థాయిలో రెండు విడతల్లో రూ.లక్ష చొప్పున, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణంలో ఒకసారి రూ.2లక్షలు, చివరి విడతగా మరో రూ.లక్ష చెల్లించనున్నట్లు వెల్లడించింది.

News October 22, 2025

3 సార్లు ఫోన్ చేసినా జగన్ నంబర్ పని చేయలేదు: సీబీఐ

image

YCP చీఫ్ జగన్ లండన్ పర్యటనకు సంబంధించి <<18018569>>సీబీఐ పిటిషన్‌<<>>పై వాదనలు పూర్తయ్యాయి. జగన్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు 3సార్లు ఫోన్ చేసినా ఆయన ఇచ్చిన నంబర్ పని చేయలేదని CBI వాదనలు వినిపించింది. ఉద్దేశపూర్వకంగానే పనిచేయని నంబర్ ఇచ్చారంది. మరోసారి జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోరింది. జగన్, CBI తరఫు వాదనలు విన్న CBI కోర్టు తీర్పును ఈ నెల 28న వెల్లడిస్తానని పేర్కొంది.