News March 22, 2025

మూడో దఫా నామినేటెడ్ పోస్టులపై కసరత్తు

image

AP: రాష్ట్రంలో మూడో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 21 ప్రముఖ దేవాలయాల పాలకమండళ్లు, 222 మార్కెట్ యార్డ్ కమిటీల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో పోస్టుకు 2-3 పేర్లు పరిశీలిస్తున్నారని, సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఇప్పటికే సిఫార్సులు అందజేశారని వార్తలు వస్తున్నాయి.

Similar News

News December 11, 2025

జాగ్రత్తగా ఓటేయండి.. గ్రామాల పురోగతికి పాటుపడండి!

image

TG: గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యలు తీర్చడంలో సర్పంచ్‌లదే కీలకపాత్ర. నోటు, క్వార్టర్‌, బిర్యానీకి ఆశపడి ఓటును అమ్ముకుంటే ఐదేళ్లూ ఇబ్బందిపడాల్సిందే. కులం, బంధుత్వాలు, పార్టీలు చూసి అసమర్థుడికి ఓటేస్తే అధోగతే. అందుకే 24/7 అందుబాటులో ఉండే, సమస్యలపై స్పందించే నాయకుడిని ఎన్నుకోవాలి. ఇందులో యువత పాత్ర కీలకం. సమర్థుడికి <<18527601>>ఓటేసి<<>>, కుటుంబీకులతోనూ ఓట్లేయించి గ్రామాల పురోగతికి పాటుపడండి.

News December 11, 2025

భారత వాతావరణశాఖలో 134 పోస్టులు.. అప్లై చేశారా?

image

భారత వాతావరణ శాఖ(<>IMD<<>>)లో 134 ప్రాజెక్ట్ సైంటిస్ట్ , సైంటిఫిక్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి డిసెంబర్ 14వరకే అవకాశం ఉంది. పోస్టును బట్టి MSc, BE, B.Tech, PhD, ME, M.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల వారు అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mausam.imd.gov.in/

News December 11, 2025

సెకండరీ డిస్‌మెనోరియాని ఎలా గుర్తించాలంటే?

image

ప్రైమరీ డిస్‌మెనోరియా అంటే రజస్వల అయినప్పటి నుంచి పీరియడ్స్ రెండు రోజుల్లోనే నొప్పి ఉంటుంది. కానీ సెకండరీ డిస్‌మెనోరియాలో నెలసరికి ముందు, తర్వాత కూడా తీవ్రంగా నొప్పి వస్తుంది. దీంతోపాటు యూరిన్ ఇన్ఫెక్షన్లు, కలయిక సమయంలో నొప్పి, బ్లీడింగ్‌లో మార్పులు ఉంటాయి. కాబట్టి సెకండరీ డిస్‌మెనోరియా లక్షణాలు కనిపిస్తే వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.