News March 22, 2025
మూడో దఫా నామినేటెడ్ పోస్టులపై కసరత్తు

AP: రాష్ట్రంలో మూడో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 21 ప్రముఖ దేవాలయాల పాలకమండళ్లు, 222 మార్కెట్ యార్డ్ కమిటీల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో పోస్టుకు 2-3 పేర్లు పరిశీలిస్తున్నారని, సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఇప్పటికే సిఫార్సులు అందజేశారని వార్తలు వస్తున్నాయి.
Similar News
News December 21, 2025
శ్రీవారి భక్తుల కోసం ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్!

AP: శ్రీవారి భక్తులకు తిరుపతిలోనే వసతి కల్పించేందుకు అలిపిరిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి టీటీడీ నిర్ణయించింది. 25వేల మందికి వసతి కెసాసిటీతో దాదాపు రూ.4వేల కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో వేలాది గదులు, బాత్రూమ్లు, లాకర్లు, అన్నప్రసాద వితరణ కేంద్రాలతోపాటు ప్రైవేటు రెస్టారెంట్లు, పార్కు, ఆడిటోరియం ఉంటాయని సమాచారం.
News December 21, 2025
ఎద్దు తన్నునని గుర్రంచాటున దాగినట్లు

ఎవరైనా ఎద్దు పొడుస్తుందని లేదా తన్నుతుందని భయపడి, దాని నుంచి రక్షణ కోసం వెళ్లి గుర్రం వెనుక దాక్కుంటే అంత కంటే పెద్ద ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఎద్దు కంటే గుర్రం మరింత వేగంగా, బలంగా తన్నుతుంది. అంటే ఎవరైనా వ్యక్తి ఒక చిన్న కష్టం నుంచి బయటపడాలని చూస్తూ, తనకు తెలియకుండానే అంతకంటే భయంకరమైన చిక్కుల్లో పడినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.
News December 21, 2025
కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నారా?

అకారణంగా మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? భాగస్వామితో మనస్పర్థలున్నాయా? దీనివల్ల ప్రశాంతత కరవవుతోందా? దీనికి గ్రహ గతులు సరిగా లేకపోవడం, వాస్తు దోషాలే కారణమవ్వొచ్చు! దీని నివారణకు రోజూ ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతం శుభాన్నిస్తుంది. సోమవారాలు శివాలయానికి వెళ్లడం మంచిది. అభిషేకంతో అధిక ఫలితముంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి, ఇల్లు ఆనందమయంగా మారుతుంది.


