News June 2, 2024

EXIT POLLS: ఉమ్మడి చిత్తూరులో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకే మెజారిటీ స్థానాలు వస్తాయని చాణిక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 14 స్థానాల్లో టీడీపీకి 6, వైసీపీకి 4, జనసేనకు ఒక సీటు వస్తుందని, మిగిలిన మూడు చోట్ల బిగ్ ఫైట్ నెలకొందని తెలిపింది. అందులో ఒకచోట వైసీపీకి, మరోచోట టీడీపీ ఎడ్జ్ ఉండగా.. మిగిలిన ఒకస్థానంలో పోటాపోటీ ఉంటుందని వివరించింది. ఈ సర్వేపై మీ కామెంట్ తెలపండి.

Similar News

News December 15, 2025

చిత్తూరు: 43 ఫిర్యాదుల స్వీకరణ

image

చిత్తూరు జిల్లాలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవిన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడి 43 ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చీటింగ్–3, కుటుంబ తగాదాలు–5, వేధింపులు–3, భూ తగాదాలు–10, ఇంటి తగాదాలు–5, డబ్బు తగాదాలు–8, ఆస్తి తగాదాలకు సంబంధించిన 9 ఫిర్యాదులు అందాయన్నారు.

News December 15, 2025

ప్రతి అంశంలో కానిస్టేబుళ్లు కీలకం: చిత్తూరు SP

image

ప్రజా భద్రత కోసం నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లు అహర్నిశలు పనిచేయాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. విజయవాడలో నియామక పత్రాలు స్వీకరించనున్న 196 మంది అభ్యర్థులతో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కానిస్టేబుళ్లు చేసే కృషి మీదే శాంతి భద్రతల నిర్వహణ ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి అంశంలోనూ కానిస్టేబుల్ పాత్ర కీలకమన్నారు.

News December 15, 2025

చిత్తూరులో పెరిగిన కోడిగుడ్ల ధర

image

చిత్తూరు జిల్లాలో కోడి గుడ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత నెలలో డజన్ రూ.84లకే లభించేవి. ప్రస్తుతం రూ.96కు చేరుకుంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఉత్పత్తిదారులు తెలుపుతున్నారు. అంగన్వాడీ, పాఠశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేవారు పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నారు. కోళ్ల పెంపకం తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని, జనవరి అనంతరం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.