News October 15, 2024
ఎగ్జిట్ పోల్స్కు శాస్త్రీయత లేదు: రాజీవ్ కుమార్

ఎగ్జిట్ పోల్స్పై సీఈసీ రాజీవ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్కు శాస్త్రీయత లేదని, వాటి ఆధారంగా తమపై నిందలు వేయడం అర్థరహితమని అన్నారు. కౌంటింగ్ రోజున ఉదయం 9.30 గంటలకంటే ముందు ఇచ్చే ఫలితాలు బోగస్ అని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా మాత్రమేనని, వీటిలో ఈసీ ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. కాగా ఇటీవల వెలువడిన ఫలితాల్లో హరియాణా ఎగ్జిట్ పోల్స్ తారుమారైన సంగతి తెలిసిందే.
Similar News
News December 14, 2025
మూడేళ్లలో 17 లక్షల ఇళ్లు నిర్మిస్తాం: వివేక్

TG: రాబోయే మూడేళ్లలో 17 లక్షల ఇళ్లు నిర్మిస్తామని మంత్రి వివేక్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. వికారాబాద్లోని నస్కల్లో ATC శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు. యువతకు సరైన ఉద్యోగాలు రావాలంటే స్కిల్ తప్పనిసరని చెప్పారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టకపోగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. త్వరలోనే తమ ప్రభుత్వం మరో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తుందని పేర్కొన్నారు.
News December 14, 2025
అరక అరిగిన గరిసె విరుగును

‘అరక’ అంటే పొలం దున్నడానికి ఉపయోగించే నాగలి. ‘గరిసె’ అంటే ధాన్యాన్ని నిల్వచేసే కొట్టం. ఒక రైతు తన నాగలి అరిగిపోయేంత కష్టపడి పొలం దున్నితే, ఆ శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని, ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగి, ధాన్యాగారా(గరిసె)లు నిండిపోతాయని దీని అర్థం. ఎంత కష్టపడి శ్రమిస్తే, అంత గొప్ప ఫలితాలు లభిస్తాయి అనే నీతిని ఈ సామెత తెలియజేస్తుంది.
News December 14, 2025
ఆడవాళ్లు జుట్టు విరబోసుకొని ఆలయాలకు వెళ్లవచ్చా?

శాస్త్రాల ప్రకారం.. స్త్రీలు దేవాలయాలకు వెళ్లేటప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్లకూడదు. ఈ చర్యను అపవిత్రంగా భావిస్తారు. అలాగే ఇది భగవంతుడికి అపచారం చేసినట్లవుతుందని పండితులు చెబుతున్నారు. దీనివల్ల కొన్ని దోషాలు కూడా కలుగుతాయని అంటున్నారు. పూజలు, ఆలయాల్లో పవిత్రత, శుచి, శుభ్రతలను పాటించాలని, గుళ్లకు వెళ్లే స్త్రీలు జుట్టును శుభ్రంగా ముడివేసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే దైవ కృప లభిస్తుందంటున్నారు.


