News October 15, 2024
ఎగ్జిట్ పోల్స్కు శాస్త్రీయత లేదు: రాజీవ్ కుమార్

ఎగ్జిట్ పోల్స్పై సీఈసీ రాజీవ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్కు శాస్త్రీయత లేదని, వాటి ఆధారంగా తమపై నిందలు వేయడం అర్థరహితమని అన్నారు. కౌంటింగ్ రోజున ఉదయం 9.30 గంటలకంటే ముందు ఇచ్చే ఫలితాలు బోగస్ అని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా మాత్రమేనని, వీటిలో ఈసీ ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. కాగా ఇటీవల వెలువడిన ఫలితాల్లో హరియాణా ఎగ్జిట్ పోల్స్ తారుమారైన సంగతి తెలిసిందే.
Similar News
News December 20, 2025
నంద్యాల: ALL THE BEST హసీనా, అంకిత

రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలో నంద్యాల జిల్లా క్రీడాకారులు హసీనా, అంకిత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి కోచింగ్కు ఎంపికయ్యారు. శిక్షణలో మంచి ప్రతిభ కనబరిస్తే వారిని జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేస్తారని స్పాన్సర్ వసుంధర దేవి తెలిపారు. నంద్యాల జిల్లా నుంచి వీరిద్దరే ఎంపిక కావడం గొప్ప విషయమని అన్నారు. చదువులో రాణిస్తూనే క్రీడల్లోనూ ప్రతిభ చూపడం హర్షణీయమన్నారు.
News December 20, 2025
ఎప్స్టీన్ ఫైల్స్.. వేలాది ఫొటోలు రిలీజ్

అమెరికా లైంగిక నేరగాడు ఎప్స్టీన్కు సంబంధించి US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్(DOJ) మూడు లక్షలకు పైగా పేజీల రికార్డులను తాజాగా విడుదల చేసింది. ఎప్స్టీన్ ప్రైవేట్ ఐల్యాండ్లో బిల్క్లింటన్, ట్రంప్, మైకేల్ జాక్సన్ వంటి ప్రముఖులతో పాటు వందల మంది అమ్మాయిలు నగ్నంగా కనిపించే చిత్రాలు అందులో ఉన్నాయి. ఓ గదిలో బిల్క్లింటన్ అమ్మాయి డ్రెస్సులో ఉన్న పెయింటింగ్ సంచలనంగా మారింది.
News December 20, 2025
కలుపు మందుల పిచికారీ – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఏ పంటకు సిఫార్సు చేసిన కలుపు మందులను ఆ పంటలో మాత్రమే సరైన మోతాదులో ఫ్లాట్ ప్యాన్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్ను ఉపయోగించి పిచికారీ చేయాలి. కలుపు మందులను ఇతర రసాయనాలతో (కీటక/శిలింద్రనాశినులు/పోషకాలు) కలిపి ఉపయోగిస్తే కలుపు మందుల సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పంట మొలకెత్తాక ఉపయోగించే కలుపు మందులను.. కలుపు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారి చేసి సమర్థవంతంగా అరికట్టవచ్చు.


