News October 15, 2024

ఎగ్జిట్ పోల్స్‌కు శాస్త్రీయత లేదు: రాజీవ్ కుమార్

image

ఎగ్జిట్ పోల్స్‌పై సీఈసీ రాజీవ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌కు శాస్త్రీయత లేదని, వాటి ఆధారంగా తమపై నిందలు వేయడం అర్థరహితమని అన్నారు. కౌంటింగ్ రోజున ఉదయం 9.30 గంటలకంటే ముందు ఇచ్చే ఫలితాలు బోగస్ అని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా మాత్రమేనని, వీటిలో ఈసీ ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. కాగా ఇటీవల వెలువడిన ఫలితాల్లో హరియాణా ఎగ్జిట్ పోల్స్ తారుమారైన సంగతి తెలిసిందే.

Similar News

News December 23, 2025

శివాజీ కామెంట్స్.. మహిళా కమిషన్ వార్నింగ్!

image

సినీ వేడుకల్లో యాక్టర్లు జాగ్రత్తగా మాట్లాడాలని TG మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద సూచించారు. మహిళల్ని అవమానించేలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై <<18648181>>వివాదాస్పద కామెంట్స్<<>> చేసిన శివాజీకి నోటీసులు జారీ చేశారు. ఆయన వ్యాఖ్యలను లీగల్ టీమ్ పరిశీలించిందని, చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటు శివాజీ క్షమాపణలు చెప్పాలంటూ ‘MAA’ ప్రెసిడెంట్‌కు TFI వాయిస్ ఆఫ్ ఉమెన్ గ్రూప్ లేఖ రాసింది.

News December 23, 2025

విద్యార్థుల కోసం పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్: సీఎం

image

AP: యువతకు క్వాంటం టెక్నాలజీ కోర్సులను అందించనున్నట్లు CM CBN తెలిపారు. IIT మద్రాస్ ప్రతినిధులతో భేటీలో మాట్లాడుతూ ‘JAN చివరికల్లా క్వాంటం టెక్నాలజీపై సిలబస్ రూపొందించాలి. స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలి. విద్యార్థులు ఇన్నోవేషన్స్ ప్రదర్శించేలా JANలో పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తాం. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఆలోచన వారిలో కలిగించేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయి’ అని పేర్కొన్నారు.

News December 23, 2025

రన్నింగ్ VS వాకింగ్.. ఎవరికి ఏది మేలు?

image

వాకింగ్ కంటే రన్నింగ్ ఎక్కువ మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ‘పరిగెత్తడం వల్ల కీళ్లు దెబ్బతింటాయనేది అపోహ. హెల్తీగా ఉన్నవాళ్లు వారానికి 5 రోజులు 45ని.లు పరిగెత్తితే గుండె సామర్థ్యం, మెదడు పనితీరు మెరుగవుతుంది. నడకతో పోలిస్తే పరుగు తక్కువ సమయంలో ఎక్కువ జీవక్రియ ప్రయోజనాలను అందిస్తుంది. ప్రారంభ దశలో ఉన్నవారికి నడక, శారీరక సామర్థ్యం ఉన్నవారు రన్నింగ్ చేయడం ఉత్తమం’ అని సూచిస్తున్నారు. SHARE IT