News October 15, 2024
ఎగ్జిట్ పోల్స్కు శాస్త్రీయత లేదు: రాజీవ్ కుమార్

ఎగ్జిట్ పోల్స్పై సీఈసీ రాజీవ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్కు శాస్త్రీయత లేదని, వాటి ఆధారంగా తమపై నిందలు వేయడం అర్థరహితమని అన్నారు. కౌంటింగ్ రోజున ఉదయం 9.30 గంటలకంటే ముందు ఇచ్చే ఫలితాలు బోగస్ అని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా మాత్రమేనని, వీటిలో ఈసీ ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. కాగా ఇటీవల వెలువడిన ఫలితాల్లో హరియాణా ఎగ్జిట్ పోల్స్ తారుమారైన సంగతి తెలిసిందే.
Similar News
News December 11, 2025
భారత వాతావరణశాఖలో 134 పోస్టులు.. అప్లై చేశారా?

భారత వాతావరణ శాఖ(<
News December 11, 2025
సెకండరీ డిస్మెనోరియాని ఎలా గుర్తించాలంటే?

ప్రైమరీ డిస్మెనోరియా అంటే రజస్వల అయినప్పటి నుంచి పీరియడ్స్ రెండు రోజుల్లోనే నొప్పి ఉంటుంది. కానీ సెకండరీ డిస్మెనోరియాలో నెలసరికి ముందు, తర్వాత కూడా తీవ్రంగా నొప్పి వస్తుంది. దీంతోపాటు యూరిన్ ఇన్ఫెక్షన్లు, కలయిక సమయంలో నొప్పి, బ్లీడింగ్లో మార్పులు ఉంటాయి. కాబట్టి సెకండరీ డిస్మెనోరియా లక్షణాలు కనిపిస్తే వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 11, 2025
కోనేటి రాయడి కునుకు కొద్దిసేపే.. అదీ మన కోసమే!

1933కి ముందు శ్రీవారికి గంటల తరబడి విశ్రాంతి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. భక్తుల సంఖ్య పెరగడంతో స్వామివారి విశ్రాంతి సమయం తగ్గిపోయింది. ఒకప్పుడు పగలు మాత్రమే దర్శనమిచ్చిన స్వామి నేడు అర్ధరాత్రి దాటినా భక్తుల మొర వింటున్నాడు. ఏడు కొండలు ఎక్కిన మనకు సంతోషాన్ని పంచడానికి ఆ ఏడు కొండలవాడు అలుపు లేకుండా దర్శనమిస్తున్నాడు. ఇంతటి కరుణ చూపే స్వామీ.. నీకెప్పుడూ రుణపడి ఉంటాం!


