News October 29, 2024

మంగళగిరిలో ప్రయోగాత్మకంగా డ్రోన్ పరీక్ష

image

AP: వైద్యరంగంలో సరికొత్త సేవలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఎయిమ్స్‌లో ప్రయోగాత్మకంగా డ్రోన్ సేవలను ప్రారంభించారు. మంగళగిరి ఎయిమ్స్ నుంచి 12KM దూరంలోని నూతక్కి PHCకి డ్రోన్‌ని పంపారు. అక్కడ మహిళా రోగి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించి తిరిగొచ్చింది. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డ్రోన్ల వాడకంపై ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 11 చోట్ల ఈ సేవలను పరీక్షించారు.

Similar News

News December 14, 2025

తిహార్ జైలును తరలించనున్న ఢిల్లీ సర్కార్

image

దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగారంగా పేరొందిన ఢిల్లీలోని తిహార్ జైలును మరోచోటుకు తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఢిల్లీ CM రేఖా గుప్తా ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. జైలులో ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు భద్రతా సమస్యలు, మౌలిక వసతుల మెరుగుదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సుమారు 10,000 మంది సామర్థ్యం ఉన్న తిహార్‌లో ప్రస్తుతం 19,000 మందికిపైగా ఖైదీలు ఉన్నారు.

News December 14, 2025

ఆరేళ్ల ప్రేమ.. ఇద్దరు పిల్లలు.. త్వరలో పెళ్లి

image

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ కూడా అయిందని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. 2019లో మెహర్‌ జెసియాతో విడాకుల తర్వాత గాబ్రియెల్లాతో అర్జున్‌ ప్రేమ బంధం కొనసాగుతోంది. పెళ్లికి ముందే వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గాబ్రియెల్లా తెలుగులో ‘ఊపిరి’ సినిమాలో, అర్జున్‌ ‘భగవంత్‌ కేసరి’లో మెప్పించారు.

News December 14, 2025

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్

image

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన బిహార్ మంత్రిగా ఉన్నారు. అటు UP BJP అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి స్థానంలో పంకజ్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఈయన 7 సార్లు ఎంపీగా గెలిచారు.