News February 16, 2025

రూ.62కోట్ల నష్టం తెచ్చిపెట్టిన ఎక్స్‌ప్రెస్

image

సాధారణంగా రైళ్లలో చాలా రద్దీ ఉంటుంది. సీటు దొరకడమే కష్టం. అయితే ఢిల్లీ-లక్నో, అహ్మదాబాద్-ముంబై మార్గాల్లో నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల కొరతతో ఇబ్బంది పడుతోంది. గత మూడేళ్లుగా ఈ ట్రైన్ వల్ల రైల్వేశాఖకు రూ.62.88 కోట్ల నష్టం వచ్చింది. దీంతో దీని నిర్వహణ బాధ్యతను రైల్వే IRCTCకి అప్పగించింది. అయినప్పటికీ తగినంతగా ప్యాసింజర్‌లు లేక నష్టాల మార్గంలో ప్రయాణిస్తోంది.

Similar News

News October 23, 2025

ప్రతి జిల్లాలో కంట్రోల్ రూములు: అనిత

image

AP: దక్షిణకోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున సహాయక బృందాలను సిద్ధంగా ఉంచామని హోంమంత్రి అనిత తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించినట్లు వివరించారు. నెల్లూరు, PKS, KDP, TPT జిల్లాల్లో NDRF, SDRF బృందాలు అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

News October 23, 2025

మేడ్చల్ ఘటనపై బండి సంజయ్ ఫైర్

image

TG: గోరక్షాదళ్ సభ్యుడు సోనూసింగ్‌పై <<18077269>>దాడిని<<>> కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఎంఐఎం రౌడీలకు కాంగ్రెస్ ఆశ్రయం ఇస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయని ధ్వజమెత్తారు. గోభక్తులపై దాడులకు పాల్పడే సంఘ విద్రోహ శక్తులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు దాడిని వ్యతిరేకిస్తూ ఇవాళ డీజీపీ ఆఫీసు ఎదుట నిరసన చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు తెలిపారు.

News October 23, 2025

అక్టోబర్ 23: చరిత్రలో ఈరోజు

image

1922: రచయిత అనిశెట్టి సుబ్బారావు జననం
1923: మాజీ ఉపరాష్ట్రపతి బైరాన్‌సింగ్ షెకావత్ జననం
1979: సినీ హీరో ప్రభాస్ జననం
1991: హీరోయిన్ చాందిని చౌదరి జననం
2007: ప్రముఖ తెలుగు కవి ఉత్పల సత్యనారాయణాచార్య మరణం
2023: భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి మరణం