News July 13, 2024

దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు

image

TG: డిగ్రీ కాలేజీల్లో చేరేవారికి విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. ‘దోస్త్’ ద్వారా మూడు విడతల్లో సీట్లు పొంది కాలేజీల్లో స్వయంగా రిపోర్టింగ్ చేయాల్సిన గడువు నిన్నటితోనే ముగియాల్సి ఉంది. అయితే విద్యార్థుల విన్నపం మేరకు ఈ నెల 18 వరకు గడువు పెంచుతున్నట్లు కన్వీనర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. కాగా ఇప్పటి వరకు 1,17,057 మంది విద్యార్థులే కాలేజీల్లో రిపోర్ట్ చేశారని వెల్లడించారు.

Similar News

News December 17, 2025

సర్పంచ్ ఫలితాలు.. 3 ఓట్ల తేడాతో గెలుపు

image

TG: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కొంత మంది అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో సర్పంచ్ సీట్లు కైవసం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా గాంధీనగర్‌లో కాంగ్రెస్ బలపరిచిన బానోతు మంగీలాల్ 3 ఓట్ల తేడాతో విజయం సాధించారు. NZB జిల్లా బాన్సువాడ మం. నాగారంలో కాంగ్రెస్ మద్దతుదారు దౌల్తాపూర్ గీత 7 ఓట్ల తేడాతో గెలిచారు. కామారెడ్డి (D) జగన్నాథ్‌పల్లిలో కాంగ్రెస్ బలపరిచిన గోడండ్లు వెంకయ్య 8 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

News December 17, 2025

ఢిల్లీ కాలుష్యానికి వాహనాలూ ప్రధాన కారణం: సుప్రీంకోర్టు

image

ఢిల్లీలో గాలి కాలుష్యం సంక్షోభానికి వాహనాలు కూడా ప్రధాన కారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సిటీలోకి ఎంటర్ అయ్యే 9 టోల్ ప్లాజాలను మార్చాలని ఆదేశించింది. కాలుష్య నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరముందని పేర్కొంది. కాలుష్య స్థాయులను సమర్థవంతంగా అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని కామెంట్లు చేసింది. ట్రాఫిక్ జామ్‌లపై NHAIకి నోటీసులు జారీ చేసింది.

News December 17, 2025

వచ్చే సంక్రాంతికి 21 లక్షల పాస్ పుస్తకాలు: మంత్రి

image

AP: రీ సర్వే చేసిన గ్రామాల్లో వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. భూముల రీ క్లాసిఫికేషన్‌పై దాదాపు లక్ష ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రైవేట్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇస్తామన్నారు.