News November 11, 2024
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పెంపు

AP: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించే గడువు తేదీని పొడిగించారు. మార్చిలో ఫస్ట్, సెకండియర్ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 21వరకు ఎటువంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు. రూ.1,000 ఫైన్తో డిసెంబర్ 5 వరకు ఫీజు కట్టొచ్చన్నారు. తొలుత అక్టోబరు 21 నుంచి నవంబర్ 11 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. మరోసారి గడువు పెంచే ఆస్కారం లేదని అధికారులు స్పష్టం చేశారు.
Similar News
News December 30, 2025
రైల్వేలో 311 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

<
News December 30, 2025
వైకుంఠ ఏకాదశి వ్రత విధానం.. (1/2)

తెల్లవారుజామునే గంగాజలం కలిపిన నీటితో స్నానమాచరించి, పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. లక్ష్మీ నారాయణుల పటాన్ని అలంకరించి ధూప, దీప, పుష్ప, నైవేద్యాలను సమర్పించాలి. విష్ణు సహస్రనామం, నారాయణ మంత్రాలను జపిస్తూ, ఏకాదశి వ్రత కథను చదవాలి. హారతి ఇచ్చి వ్రతాన్ని ప్రారంభించాలి. రోజంతా తులసి తీర్థం మాత్రమే తీసుకుంటూ, హరినామ స్మరణలో గడపాలి. ముందురోజు సాత్వికాహారం తీసుకొని ఉంటే వ్రత ఫలం మెరుగ్గా ఉంటుంది.
News December 30, 2025
అడవి తల్లిబాట: అప్పుడు.. ఇప్పుడు!

AP: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంతో గిరిజన ప్రాంతాల్లో వేగంగా రోడ్లు వేస్తున్నారు. డోలీ మోతల కష్టాలను తొలగించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 7న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో దీన్ని ప్రారంభించారు. ఇందుకోసం రూ.1,005 కోట్లు కేటాయించారు. తాజాగా పంచాయతీ, రూరల్ డెవలప్మెంట్ కార్యదర్శి కృష్ణతేజ పాత, కొత్త ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.


