News July 23, 2024

మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం పొడిగింపు

image

AP: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS)కు సమాంతరంగా మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో ఉంటుందని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Similar News

News December 27, 2025

అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవట్లేదే?

image

క్రికెట్‌లో భారత్ అనగానే ఒంటికాలి మీద వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు. మన పిచ్‌ల వల్ల టెస్ట్ క్రికెట్ చచ్చిపోతోందని నోటికొచ్చిన మాటలన్నారు. అలాంటి వాళ్లు AUS పిచ్‌లపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యం. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో NOV 21న పెర్త్‌లో తొలి టెస్ట్, ఇవాళ మెల్‌బోర్న్‌లో 4వ మ్యాచ్ కేవలం రెండ్రోజుల్లోనే ముగిశాయి. మన పిచ్‌లను క్రికెట్‌కు ప్రమాదంగా అభివర్ణించినవాళ్లు ఇప్పుడు మూగబోవడం వింతగా ఉంది.

News December 27, 2025

ప్రాజెక్టులపై అసెంబ్లీలో PPT ప్రజెంటేషన్!

image

TG: ఈనెల 29 నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపై అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ చర్చ జరిగే అవకాశముంది. PPT ప్రజెంటేషన్ ద్వారా దీటుగా జవాబిచ్చేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నారు. అదే తరహాలో తానూ PPTతో ప్రశ్నించడానికి BRS నేత హరీశ్ రెడీ అవుతున్నారు. ఒకవేళ తనను అందుకు అనుమతించకపోతే సభ వెలుపల PPT ప్రదర్శించాలని యోచిస్తున్నారు.

News December 27, 2025

చలి ఎక్కువగా అనిపిస్తోందా? ఇవి కూడా కారణం కావొచ్చు

image

కొందరికి చలి ఎక్కువగా అనిపించడం అనేది శరీరంలోని వివిధ సమస్యలను సూచిస్తుందంటున్నారు నిపుణులు. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా పనిచేయనప్పుడు చలి ఎక్కువగా అనిపిస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేని వారు ఈ కోవకు చెందుతారు. అలాగే విటమిన్ B12, విటమిన్ D లోపం ఉన్నవారిలో కూడా చలి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వీరు పాలకూర, బీట్‌రూట్, గుడ్లు, చేపలు, చికెన్ పాలు, పెరుగు తినాలని సూచిస్తున్నారు.