News July 23, 2024

మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం పొడిగింపు

image

AP: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS)కు సమాంతరంగా మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో ఉంటుందని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Similar News

News December 24, 2025

BBJCCLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

కోల్‌కతాలోని బ్రేత్ వేట్ బర్న్ అండ్ జేసప్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(<>BBJCCL<<>>) 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా/బీటెక్/BE, MBA, PGDBM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bbjconst.com

News December 24, 2025

అంటే.. ఏంటి?: Triumph

image

ఈ పదం గ్రీకు భాషలో మొదలై మూడు భాషల పరిణామంతో ఇంగ్లిష్‌లోకి వచ్చింది. గ్రీకు భాషలో Thriambos పదం నుంచి లాటిన్‌లోకి triumphusగా మార్చబడింది. దాన్నుంచి పురాతన ఫ్రెంచ్‌లో triumpheగా రూపాంతరం చెంది ఇంగ్లిష్‌లో Triumphగా స్థిరపడింది. ఈ పదం అర్థం ఘన విజయం.
-రోజూ 12pmకు అంటే.. ఏంటి?లో ఓ కొత్త పదం గురించి తెలుసుకుందాం.
<<-se>>#AnteEnti<<>>

News December 24, 2025

అపరాలకు బంగారుతీగ కలుపు ముప్పు ఎక్కువ

image

మినుము, పెసర, కందిని ఆశించి నష్టపరిచే కలుపు మొక్కలలో బంగారుతీగ ముఖ్యమైనది. ఇది ఆశించిన పైర్లలో పెరుగుదల లోపిస్తుంది. దిగుబడులు భారీగా తగ్గిపోతాయి. పొలంలో ఒకసారి బంగారుతీగ విత్తనాలు పడితే కొన్నేళ్ల వరకు మొలుస్తాయి. అందుకే ఈ కలుపు మొక్కను పొలంలో గుర్తిస్తే విత్తనం ఏర్పడక ముందే వాటిని పీకి నాశనం చేయాలి. అలాగే మొక్కజొన్న, జొన్న వంటి పంటలతో పంట మార్పిడి చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.