News July 31, 2024

కవితకు రిమాండ్ పొడిగింపు

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఆగస్టు 13 వరకు ఆమెకు జుడీషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కవితతోపాటు మిగతా నిందితులను అధికారులు వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు.

Similar News

News March 3, 2026

బిజినెస్ ఫ్రెండ్లీ దేశంగా భారత్

image

వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్న దేశంగా భారత్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇన్నోవేటర్స్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ 2026లో భారత్ 55.035 స్కోర్‌తో 54 ర్యాంక్ సాధించింది. చైనా (85) కంటే మెరుగైన స్థానంలో ఉంది. దక్షిణాసియాలోనూ మనమే టాప్. కాస్ట్ ఆఫ్ లివింగ్, మార్కెట్ సైజ్, లేబర్ చట్టాల ఆధారంగా ఈ సూచీలో ర్యాంకింగ్స్ ఇస్తారు. ఇక టాప్-3లో అమెరికా, సింగపూర్, యూకే ఉన్నాయి.

News March 3, 2026

మరో ఐదు S-400 కొనేందుకు భారత్ ప్లాన్!

image

డిఫెన్స్ సిస్టమ్స్ బలోపేతంలో భాగంగా భారత్ రష్యా నుంచి మరో ఐదు S-400 స్క్వాడ్రన్లు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిని రక్షణ శాఖ త్వరలో ఆమోదించే అవకాశం ఉంది. S-400తో పాటు పలు మిసైళ్లను కొనుగోలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో S-400 కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2018లో ఐదు S-400 స్క్వాడ్రన్లను భారత్ ఆర్డర్ చేయగా ఇప్పటికి మూడే వచ్చాయి. మరో రెండు రావాల్సింది.

News March 3, 2026

కెనడాతో భారత్ ₹24వేలకోట్ల యురేనియం డీల్

image

అణుశక్తి కోసం భారత్ కెనడాతో ₹24వేలకోట్ల విలువైన యురేనియం డీల్ కుదుర్చుకుంది. ఆ దేశ ప్రధాని మెక్ కార్నీ భారత్‌ పర్యటనలో భాగంగా నిన్న దీనిని ఖరారు చేసుకుంది. దీంతో కెనడా ఇకపై భారత్‌కు యురేనియమ్‌ను సప్లై చేయనుంది. దేశంలో ఏటా 600 టన్నుల యురేనియం ఉత్పత్తి అవుతుండగా ఇండియాకు ప్రస్తుతం 1800 టన్నులు అవసరం. 2047 నాటికి భారత్ అణుశక్తి సామర్థ్యం 100 గిగావాట్లకు చేరాలన్న లక్ష్యానికి ఈ డీల్ ఉపయోగపడుతుంది.