News July 31, 2024

కవితకు రిమాండ్ పొడిగింపు

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఆగస్టు 13 వరకు ఆమెకు జుడీషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కవితతోపాటు మిగతా నిందితులను అధికారులు వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు.

Similar News

News March 2, 2026

రైల్వేలో 22,195 జాబ్స్.. దరఖాస్తు గడువు పెంపు

image

రైల్వేలో 22,195 గ్రూప్-D ఉద్యోగాలకు దరఖాస్తు గడువును మార్చి 3 నుంచి మార్చి 9వ తేదీకి పొడిగించారు. అప్లికేషన్ ఫీజు చెల్లింపు గడువు మార్చి 11తో ముగియనుంది. పోస్టును బట్టి టెన్త్, సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసై, 18-36 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. రిజర్వేషన్‌ ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: <>www.rrbchennai.gov.in<<>>

News March 2, 2026

ఖమేనీకి ఎంత మంది పిల్లలో తెలుసా?

image

ఇజ్రాయెల్-US దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి ఒక భార్య, ఆరుగురు పిల్లలున్నారు. ఆయన భార్య పేరు మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదేహ్. వీరికి 1964లో వివాహమైంది. నలుగురు కుమారులు (మోస్తఫా, మొజ్తాబా, మసౌద్, మేసమ్), ఇద్దరు కూతుళ్లు (బోష్రా, హోదా), ఏడుగురు గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీతో పాటు ఓ కూతురు, కోడలు, మనుమరాలు, అల్లుడు కూడా మరణించినట్లు వార్తలొచ్చాయి.

News March 2, 2026

సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్

image

గల్ఫ్ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీఫాతో మాట్లాడారు. ఆ దేశాల్లో భారతీయుల భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. సౌదీ, బహ్రెయిన్‌పై దాడిని ఖండించారు.