News April 24, 2024

కేజ్రీవాల్, కవితకు రిమాండ్ పొడిగింపు

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జుడీషియల్ రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. మే 7 వరకు(14 రోజులు) పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు చెప్పారు. కవిత జుడీషియల్ రిమాండ్ నేటితో ముగియగా ఆమెను ఈడీ, సీబీఐ వర్చువల్‌గా కోర్టులో హాజరుపర్చాయి. దీంతో కవిత రిమాండ్‌ను కోర్టు పొడిగించింది.

Similar News

News March 7, 2026

నేపాల్‌లో ఛేంజ్.. భారత్‌కు కలిసొస్తుందా?

image

నేపాల్‌‌లో ఎన్నికల్లో బాలెన్ షా ఆధ్వర్యంలోని ప్రజా స్వతంత్ర పార్టీ గెలుపుదిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌తో నేపాల్ బంధం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశమైంది. PM అభ్యర్థి అయిన షా జాతీయవాది. గతంలో భారత్ వ్యతిరేకత వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకున్నారు. కానీ గత పాలకుల తరహాలో చైనాకు ఫేవర్ లేకపోవడం భారత్‌కు కలిసొచ్చే విషయం. బ్యాలెన్స్డ్ ఫారిన్ రిలేషన్స్ కోరుకుంటున్నానని షా మ్యానిఫెస్టోలో చెప్పారు.

News March 7, 2026

వార్ ఎఫెక్ట్.. వంట గదిలో ధరల ‘మంట’

image

గల్ఫ్‌ యుద్ధం ప్రభావం ధరల రూపంలో మనపై పడుతోంది. తాజాగా సిలిండర్ <<19316911>>పెంపు<<>> దీనికి నిదర్శనం. భారత్‌తో పాటు జపాన్, చైనా, యూరప్‌ దేశాలకు ఖతర్ ఉత్పత్తి కేంద్రం నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(LNG), అనుబంధ ప్రొడక్టులు సప్లై అవుతాయి. వార్ నేపథ్యంలో ప్రొడక్టివిటీని నిలిపివేస్తున్నామని ఇటీవల ఖతర్ <<19299424>>ప్రకటించింది<<>>. దీంతో ఇప్పటికే యూరప్, ఆసియాలో గ్యాస్ ధరలు పెరగగా తాజాగా మన దేశంలోనూ సామాన్యులపై భారం పడింది.

News March 7, 2026

గ్యాస్ సరఫరా ఆపకండి.. IOCLకు TTD లేఖ!

image

AP: యుద్ధం వేళ కమర్షియల్ గ్యాస్ వినియోగంపై కేంద్రం <<19309548>>నియంత్రణ<<>> నేపథ్యంలో TTD అధికారుల్లో ఆందోళన మొదలైంది. నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపొద్దని IOCLను కోరింది. లేదంటే అన్న ప్రసాదాల తయారీతో పాటు ఇతర అవసరాలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుందని లేఖ రాసినట్లు సమాచారం. TTDని ఆధ్యాత్మిక పరిధిలో ఉంచి సరఫరాను కొనసాగించాలని కోరగా IOCL సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.