News November 5, 2024

టెన్త్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 18 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. రూ.50 ఫైన్‌తో ఈనెల 25, రూ.200 జరిమానాతో DEC 3, రూ.500 చెల్లింపుతో DEC 10 వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125, సప్లిమెంటరీ రాసేవారు మూడు సబ్జెక్టుల వరకు రూ.110, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలి. వృత్తి విద్య విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.

Similar News

News September 16, 2025

పెళ్లిపై మరోసారి స్పందించిన జాన్వీ కపూర్

image

తన పెళ్లిపై స్టార్ హీరోయిన్ జాన్వీ మరోసారి స్పందించారు. ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమెకు పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. ‘ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నా ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. వివాహానికి ఇంకా చాలా సమయం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ డేటింగ్‌లో ఉన్నట్లు టాక్.

News September 16, 2025

యూసుఫ్ పఠాన్‌‌‌ను ఆక్రమణదారుడిగా పేర్కొన్న హైకోర్టు

image

ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాలని మాజీ క్రికెటర్, MP యూసుఫ్ పఠాన్‌‌ను గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. అతడిని ఆక్రమణదారుడిగా పేర్కొంది. సెలబ్రిటీలు చట్టానికి అతీతులు కారని చెప్పింది. వడోదరలో ఇంటి పక్కనున్న ఖాళీ స్థలాన్ని యూసుఫ్ ఆక్రమించగా 2012లో సర్కార్ నోటీసులిచ్చింది. తాను, తన సోదరుడు క్రికెటర్లమని, సెక్యూరిటీ దృష్ట్యా ఆ భూమిని కొనేందుకు అనుమతించాలని కోరగా హైకోర్టు తాజాగా తిరస్కరించింది.

News September 16, 2025

మాడ్యులర్ కిచెన్ చేయిస్తున్నారా?

image

మాడ్యులర్ కిచెన్‌కు ఈ రోజుల్లో ఆదరణ పెరుగుతోంది. అయితే కిచెన్‌కి వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. సరకులు పెట్టుకోవడానికి అల్మారా, డీప్ డ్రా నిర్మించుకోవాలి. చాకులు, స్పూన్‌లు, గరిటెలు విడివిడిగా పెట్టుకొనేలా ఉండాలి. అప్పుడే వస్తువులు నీట్‌గా కనిపిస్తాయి. కావాల్సిన వస్తువు వెంటనే చేతికి దొరుకుతుంది. వంటగదిలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటానికి వీలుగా అవసరమైన చోట ప్లగ్ బోర్డ్స్ ఉండేలా చూసుకోవాలి.