News March 19, 2025
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు విడుదల

TG: మహిళా, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను TGPSC విడుదల చేసింది. మెరిట్ జాబితాను <
Similar News
News November 3, 2025
ఘోరం.. ఆనవాళ్లు లేకుండా మారిన బస్సు

రంగారెడ్డి జిల్లాలో టిప్పర్ ఢీకొట్టి మీద పడటంతో <<18183932>>బస్సు<<>> పూర్తిగా ధ్వంసమైంది. ముఖ్యంగా కుడివైపు ఉండే భాగం ఆనవాళ్లు లేకుండా అయింది. దీంతో ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. టన్నుల కొద్దీ బరువు ఉండే కంకర మీద పడటంతో ప్రయాణికులు దాని కింద సమాధి అయిపోయారు. జేసీబీల సాయంతో టిప్పర్ను బస్సుపై నుంచి తొలగించారు. మృతదేహాలను చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ఉన్నట్లు సమాచారం.
News November 3, 2025
బస్సు ప్రమాదం.. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు

TG: మీర్జాగూడ <<18183773>>ప్రమాదం<<>> పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా ఆమె భర్తకు గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో వారి ముగ్గురు పిల్లలు అదృష్టవశాత్తు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఓవైపు తల్లి మరణం, మరోవైపు ఆసుపత్రిలో తండ్రి ఉండటంతో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఆ చిన్నారులు ఉండిపోయారు. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.
News November 3, 2025
తగ్గుతున్న ఆకుకూరల సాగు.. కారణమేంటి?

ఒకప్పుడు చాలా రకాల ఆకుకూరల లభ్యత, వినియోగం ఉండేది. ఇప్పుడు తోటకూర, మెంతి కూర, పాలకూర, పుదీనా, గోంగూర, కొత్తిమీర, బచ్చలికూరలనే మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం. ఆకుకూరల సాగులో రైతుల కష్టం ఎక్కువగా ఉండటం, వరద ముంపునకు గురైతే పంట పూర్తిగా నష్టపోవడం వంటి కారణాల వల్ల.. రైతులు ఎక్కువ ధర పలికే కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల సాగువైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా కాలక్రమేణా ఆకుకూరల సాగు, వినియోగం తగ్గుతోంది.


