News October 4, 2024
పాకిస్థాన్ పర్యటనకు విదేశాంగ మంత్రి జైశంకర్

రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పాకిస్థాన్ వెళ్లనున్నారు. అక్టోబర్ 15-16 తేదీల్లో అక్కడ జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశానికి ఆయన హాజరవుతారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని పాక్ అధికారికంగా ఆహ్వానించింది. దీంతో మోదీ పర్యటనపై గత కొన్ని రోజులుగా సందిగ్ధం నెలకొంది. అయితే, మోదీ తరఫున జైశంకర్ ఈ సదస్సులో పాల్గొననున్నారు.
Similar News
News January 19, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 19, 2026
ఘోర పరాభవం

2024లో న్యూజిలాండ్పై స్వదేశంలో తొలి టెస్టు సిరీస్ను చేజార్చుకున్న టీమ్ ఇండియా తాజాగా తొలి వన్డే సిరీస్ను కోల్పోయింది. ఇప్పటివరకు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో సిరీస్ను కోల్పోని భారత జట్టు తాజా ఓటమితో ఈ అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ఇక ఇండోర్ వేదికలో ఆడిన 8 మ్యాచుల్లో భారత్కిదే తొలి ఓటమి కావడం గమనార్హం.
News January 19, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 19, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.28 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.04 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.20 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


