News March 19, 2025

ఏప్రిల్ నుంచి ఎక్స్‌ట్రా చెల్లించాల్సిందే

image

దేశంలో APR నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ 4% పెంపు ప్రకటన చేయగా నిన్న టాటా మోటార్స్ కూడా 3% వరకు పెంచుతామంది. మిగతా ఆటో బ్రాండ్స్ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త రేట్లతో సేల్స్‌కు రెడీ అవుతున్నాయి. ఒకవేళ మీకు రాబోయే కొన్ని వారాల్లో కారు కొనే ఆలోచన ఉంటే ఈనెల 31లోపు తీసుకుంటే ఎక్స్‌ట్రా చెల్లింపు తప్పుతుంది. డెలివరీ తీసుకొనే రోజు ఉన్న ధరనే కంపెనీ పరిగణిస్తుందని మరువొద్దు.

Similar News

News February 16, 2026

మార్ముగావ్ పోర్ట్ అథారిటీలో పోస్టులు

image

మార్ముగావ్ పోర్ట్ అథారిటీలో 13 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, బీటెక్, పీజీ, MBA, MSc, BSc, ME/MTech(ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్), MBBSఅర్హతతో పాటు పని అనుభవం గలవారు దరఖాస్తుతో పాటు డాక్యుమెంట్స్‌ను ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mptgoa.gov.in

News February 16, 2026

క్షేత్రపాలకుడు అంటే ఎవరు?

image

ఆలయం, గ్రామాన్ని రక్షిస్తాడు. ఆయన శివుని వెయ్యో అంశగా ఉద్భవించిన స్వామిగా చెబుతారు. శైవ, వైష్ణవ క్షేత్రాలలో రక్షకుడిగా ఉంటారు. తిరుమలలో రుద్రశిల, కాశీలో కాలభైరవుడు, పంచారామాల్లో జనార్దన స్వామి.. క్షేత్రపాలకులుగా కొలువై ఉన్నారు. భక్తులు, అర్చకులు ఆలయ ప్రవేశానికి ముందు ఈయన అనుమతి తీసుకోవడం సంప్రదాయం. ఈ స్వామిని దర్శించుకుంటే క్షేత్ర దర్శన ఫలం లభిస్తుందని, దుష్టశక్తుల నుంచి రక్షణ కలుగుతుందని నమ్మకం.

News February 16, 2026

పత్తిలో కలుపు సమస్య- నివారణకు సూచనలు

image

☛ పత్తి మొలకెత్తిన నెల రోజులకు కలుపు కనిపిస్తే క్విజలాఫాప్ ఇథైల్ 400ML లేదా ప్రోఫాక్విజఫాప్ 250ML, పైరిథయోబాక్ సోడియం 250ML 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ☛ ప్రతి పది రోజులకొకసారి గొర్రు, గుంటకలతో అంతరకృషి చేయాలి. కలుపును ఏరివేయాలి. ☛ వర్షాలు ఎక్కువగా ఉండి కలుపు తీయడం కుదరకపోతే పారాక్వాట్ 5ML+ 10గ్రా. యూరియాతో లీటరు నీటికి కలిపి పత్తి మొక్కలపై పడకుండా వరుసల మధ్య మాత్రమే పిచికారీ చేయాలి.