News March 19, 2025

ఏప్రిల్ నుంచి ఎక్స్‌ట్రా చెల్లించాల్సిందే

image

దేశంలో APR నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ 4% పెంపు ప్రకటన చేయగా నిన్న టాటా మోటార్స్ కూడా 3% వరకు పెంచుతామంది. మిగతా ఆటో బ్రాండ్స్ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త రేట్లతో సేల్స్‌కు రెడీ అవుతున్నాయి. ఒకవేళ మీకు రాబోయే కొన్ని వారాల్లో కారు కొనే ఆలోచన ఉంటే ఈనెల 31లోపు తీసుకుంటే ఎక్స్‌ట్రా చెల్లింపు తప్పుతుంది. డెలివరీ తీసుకొనే రోజు ఉన్న ధరనే కంపెనీ పరిగణిస్తుందని మరువొద్దు.

Similar News

News January 30, 2026

ఖమ్మం: బాక్సింగ్‌లో ‘రూప’ మెరుపు

image

నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెం గురుకుల కళాశాల విద్యార్థిని వి.రూప బాక్సింగ్‌లో సత్తా చాటింది. హైదరాబాద్‌లో జరిగిన అండర్-19 రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఫిబ్రవరిలో కర్ణాటకలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రూప ఎంపికైంది. ప్రతిభ చాటిన రూపను ప్రిన్సిపాల్ శ్రీలత, క్రీడా విభాగం సిబ్బంది ఘనంగా అభినందించారు.

News January 30, 2026

నవగ్రహాలు – నవరత్నాలు: ఏ గ్రహానికి ఏ రత్నం?

image

ఆదిత్యుడు – కెంపు
చంద్రుడు – ముత్యం
అంగారకుడు – ఎర్రని పగడం
బుధుడు – పచ్చ
గురు – పుష్య రాగం
శుక్రుడు – వజ్రం
శని – నీలం
రాహువు – గోమేధుకం
కేతువు – వైడూర్యం

News January 30, 2026

రాజీకి ఏ విధానం అనుసరించారు: హైకోర్టు

image

AP: పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని TTD EOను HC ఆదేశించింది. రాజీకి అథారిటీ ఎవరు? ఏ విధానం అనుసరించారు? టీటీడీ నిబంధనలపై స్పష్టత ఇవ్వాలని తెలిపింది. సింగిల్‌ జడ్జి ఆదేశాలపై వచ్చిన అప్పీల్‌తో పాటు సుమోటో పిటిషన్‌ను కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం విచారించింది. కేసును Feb 5కు వాయిదా వేసింది.