News March 19, 2025
ఏప్రిల్ నుంచి ఎక్స్ట్రా చెల్లించాల్సిందే

దేశంలో APR నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ 4% పెంపు ప్రకటన చేయగా నిన్న టాటా మోటార్స్ కూడా 3% వరకు పెంచుతామంది. మిగతా ఆటో బ్రాండ్స్ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త రేట్లతో సేల్స్కు రెడీ అవుతున్నాయి. ఒకవేళ మీకు రాబోయే కొన్ని వారాల్లో కారు కొనే ఆలోచన ఉంటే ఈనెల 31లోపు తీసుకుంటే ఎక్స్ట్రా చెల్లింపు తప్పుతుంది. డెలివరీ తీసుకొనే రోజు ఉన్న ధరనే కంపెనీ పరిగణిస్తుందని మరువొద్దు.
Similar News
News February 15, 2026
త్రిమూర్తుల సంగమ రూపం శివలింగం

శివలింగం అంటే ఆకారమే కాదు. అనంత విశ్వానికి సంకేతం. ఇందులో త్రిమూర్తులు ఉంటారు. అడుగున ఉండే చతురస్రాకార బ్రహ్మ భాగం సృష్టిని, మధ్యలో ఉండే అష్టకోణాల విష్ణు భాగం(పాణిపట్టం) స్థితిని, పైన కనిపించే వృత్తాకార రుద్ర భాగం లయను సూచిస్తాయి. ఇలా ఒకే శివలింగంలో సృష్టి, స్థితి, లయకారకులు ఉండటం వల్ల దీనిని పూజించడం అంటే సమస్త బ్రహ్మాండాన్ని ఆరాధించడమే. నిరాకారుడైన పరమాత్మను ఆరాధించే అత్యున్నత రూపం ఈ శివలింగం.
News February 15, 2026
225 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News February 15, 2026
UN రిపోర్ట్.. 3 రోజుల్లో 6,000 మంది హతం!

సుడాన్లోని డార్ఫర్లో గతేడాది OCTలో పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్సెస్ మారణహోమం సృష్టించాయని ఐక్యరాజ్యసమితి(UN) తాజాగా విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. RSF దాడుల్లో 3 రోజుల్లోనే (OCT 25th-27th) 6వేల మందికి పైగా మరణించారని వెల్లడించింది. RSF సైనికులు సామూహిక హత్యలు, లైంగిక హింసకు పాల్పడినట్లు తెలిపింది. సూడాన్ మిలిటరీ, RSFకి మధ్య 2023 APRలో మొదలైన ఆధిపత్య పోరు యుద్ధానికి దారితీసింది.


