News March 19, 2025

ఏప్రిల్ నుంచి ఎక్స్‌ట్రా చెల్లించాల్సిందే

image

దేశంలో APR నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ 4% పెంపు ప్రకటన చేయగా నిన్న టాటా మోటార్స్ కూడా 3% వరకు పెంచుతామంది. మిగతా ఆటో బ్రాండ్స్ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త రేట్లతో సేల్స్‌కు రెడీ అవుతున్నాయి. ఒకవేళ మీకు రాబోయే కొన్ని వారాల్లో కారు కొనే ఆలోచన ఉంటే ఈనెల 31లోపు తీసుకుంటే ఎక్స్‌ట్రా చెల్లింపు తప్పుతుంది. డెలివరీ తీసుకొనే రోజు ఉన్న ధరనే కంపెనీ పరిగణిస్తుందని మరువొద్దు.

Similar News

News January 14, 2026

ర్యాంకింగ్స్‌లో నంబర్-1 ప్లేస్‌లో ఇండియా

image

ICC లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో IND అదరగొట్టింది. వన్డేల్లో 122 పాయింట్లతో తొలి ప్లేస్‌లో నిలిచింది. T20ల్లో 272 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. వన్డే బ్యాటింగ్‌లో కోహ్లీ, T20ల్లో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో టెస్టుల్లో బుమ్రా, T20ల్లో వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో టెస్టుల్లో జడేజా మొదటి స్థానంలో ఉన్నారు.

News January 14, 2026

‘10 మినిట్స్ డెలివరీ’పై జెప్టో, స్విగ్గీ వెనక్కి

image

కేంద్రం <<18845524>>ఆదేశాలతో<<>> 10 మినిట్స్ డెలివరీ క్లెయిమ్‌ను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో నిలిపివేశాయి. నిన్న బ్లింకిట్ ఈ ప్రకటన చేయగా తాజాగా ఈ రెండు సంస్థలూ 10 మినిట్స్ క్లెయిమ్‌ను ఆపివేస్తున్నట్లు తెలిపాయి. తమ వెబ్‌సైట్లు, యాప్‌ల నుంచి ‘10 మినిట్స్ డెలివరీ’ అనే ప్రకటనలను తొలగించాయి. కాగా గిగ్ వర్కర్ల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ హామీని ఇవ్వొద్దని కేంద్ర మంత్రి మన్సూఖ్ మాండవీయా డెలివరీ సంస్థలకు సూచించారు.

News January 14, 2026

ఒకప్పుడు ₹2వేల కోట్ల ఆస్తులు.. కానీ ఇప్పుడు..!

image

దర్భాంగా ఫ్యామిలీ (బిహార్‌) దేశంలోని రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీలలో ఒకటి. ఈ ఫ్యామిలీ చివరి మహారాణి కామసుందరి దేవి(96) ఈ నెల 12న చనిపోయారు. ఆమె భర్త, చివరి మహారాజు కామేశ్వర్ సింగ్ 1962లో చనిపోగా, అప్పుడు ఈ ఫ్యామిలీ ఆస్తుల విలువ ₹2,000Cr(ప్రస్తుత వాల్యూ ₹4లక్షల కోట్లు). ఇందులో ఇప్పుడు 2% కంటే తక్కువే ఉన్నట్లు సమాచారం. 1962 IND-CHN యుద్ధం సమయంలో ఈ ఫ్యామిలీ ప్రభుత్వానికి 600kgs గోల్డ్ సాయం చేసింది.