News March 19, 2025
ఏప్రిల్ నుంచి ఎక్స్ట్రా చెల్లించాల్సిందే

దేశంలో APR నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ 4% పెంపు ప్రకటన చేయగా నిన్న టాటా మోటార్స్ కూడా 3% వరకు పెంచుతామంది. మిగతా ఆటో బ్రాండ్స్ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త రేట్లతో సేల్స్కు రెడీ అవుతున్నాయి. ఒకవేళ మీకు రాబోయే కొన్ని వారాల్లో కారు కొనే ఆలోచన ఉంటే ఈనెల 31లోపు తీసుకుంటే ఎక్స్ట్రా చెల్లింపు తప్పుతుంది. డెలివరీ తీసుకొనే రోజు ఉన్న ధరనే కంపెనీ పరిగణిస్తుందని మరువొద్దు.
Similar News
News January 29, 2026
కొలంబోకి టికెట్లు బుక్ చేసుకున్న పాకిస్థాన్!

WC కోసం కొలంబో(SL)కు వెళ్లేందుకు పాకిస్థాన్ టీమ్ టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పాక్ కొలంబో వెళ్తోందని ‘టెలికమ్ ఆసియా స్పోర్ట్’ పేర్కొంది. తమ రిక్వెస్ట్కు ICC నో చెప్పడంతో బంగ్లా WC నుంచి వైదొలిగింది. దానికి మద్దతుగా తాము కూడా బాయ్కాట్ చేసే విషయాన్ని ఆలోచిస్తామని పాక్ చెప్పింది. అయితే తమ పార్టిసిపేషన్పై సోమవారం PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ తుది నిర్ణయం ప్రకటించే అవకాశముంది.
News January 29, 2026
లిక్కర్ కేసులో ముగ్గురికి బెయిల్

ఏపీ లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిలిచ్చింది. రాజ్ కసిరెడ్డి, ముప్పిడి అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది.
News January 29, 2026
‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా FTA: ప్రధాని మోదీ

భారత్, EU వాణిజ్య ఒప్పందం దేశ భవిష్యత్కు కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా ఈ ఒప్పందం మారిందన్నారు. ఈ FTA యువతకు, ఆత్మనిర్భర్ భారత్కు ఊతమిస్తుందని చెప్పారు. మన వస్తువులకు అతిపెద్ద మార్కెట్ దక్కిందని, బ్రాండ్కు గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. తయారీ, సర్వీస్ సెక్టార్లలోనూ దేశ భాగస్వామ్యం పెరుగుతుందన్నారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ నినాదంతో ముందుకెళ్తామని చెప్పారు.


