News March 19, 2025

ఏప్రిల్ నుంచి ఎక్స్‌ట్రా చెల్లించాల్సిందే

image

దేశంలో APR నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ 4% పెంపు ప్రకటన చేయగా నిన్న టాటా మోటార్స్ కూడా 3% వరకు పెంచుతామంది. మిగతా ఆటో బ్రాండ్స్ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త రేట్లతో సేల్స్‌కు రెడీ అవుతున్నాయి. ఒకవేళ మీకు రాబోయే కొన్ని వారాల్లో కారు కొనే ఆలోచన ఉంటే ఈనెల 31లోపు తీసుకుంటే ఎక్స్‌ట్రా చెల్లింపు తప్పుతుంది. డెలివరీ తీసుకొనే రోజు ఉన్న ధరనే కంపెనీ పరిగణిస్తుందని మరువొద్దు.

Similar News

News February 6, 2026

ఐఐటీ ఢిల్లీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

<>ఐఐటీ<<>> ఢిల్లీలో 4 ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ ఇంజినీర్/సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. PhD(మెకానికల్ ఇంజినీరింగ్/కెమికల్ ఇంజినీరింగ్)అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.1,00000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ird.iitd.ac.in

News February 6, 2026

ఆరోగ్యం కోసం 4 శక్తిమంతమైన మంత్రాలు

image

అనారోగ్య నివారణకు ఆయుర్వేద దేవుడైన ధన్వంతరిని ప్రార్థించాలని పండితులు సూచిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ధన్వంతరి మంత్రం పఠించాలంటున్నారు. ‘కర్మ సంబంధిత అనారోగ్యాలు తొలగి, సౌభాగ్యం కలగడానికి ఆరోగ్య శని మంత్రం ఉత్తమం. శివానుగ్రహంతో అకాల మరణ గండాలు తొలగేందుకు మహామృత్యుంజయ మంత్రం పఠించాలి. ధన్వంతరి గాయత్రీ మంత్రంతో దైవిక రక్షణ లభిస్తుంది. ఇది స్వస్థత, బుద్ధికి తేజస్సును ఇస్తుంది’ అని చెబుతున్నారు.

News February 6, 2026

రాజస్థాన్ మర్డర్.. భర్త హత్యకు 16 రోజుల ముందే ప్లాన్

image

<<19064691>>రాజస్థాన్‌ మర్డర్ కేసు<<>>లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త ఆశిష్ కుమార్‌ను హత్య చేయాలని 16రోజుల ముందే 7ఏళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్న ప్రియుడు సంజయ్‌తో భార్య అంజలి ప్లాన్ చేసినట్టు విచారణలో తేలింది. ‘అంజలి ప్రియుడితో కలిసి ఆశిష్ అడ్డును తొలగించుకోవాలనుకుంది. రోహిత్, సిద్ధార్థ్ అనే మరో ఇద్దరి సపోర్ట్ తీసుకున్నారు. దాడికి ప్లాన్ చేసిన ప్రాంతంలో వారిద్దరూ రెక్కీ చేశారు’ అని పోలీసులు తెలిపారు.