News March 19, 2025

ఏప్రిల్ నుంచి ఎక్స్‌ట్రా చెల్లించాల్సిందే

image

దేశంలో APR నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ 4% పెంపు ప్రకటన చేయగా నిన్న టాటా మోటార్స్ కూడా 3% వరకు పెంచుతామంది. మిగతా ఆటో బ్రాండ్స్ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త రేట్లతో సేల్స్‌కు రెడీ అవుతున్నాయి. ఒకవేళ మీకు రాబోయే కొన్ని వారాల్లో కారు కొనే ఆలోచన ఉంటే ఈనెల 31లోపు తీసుకుంటే ఎక్స్‌ట్రా చెల్లింపు తప్పుతుంది. డెలివరీ తీసుకొనే రోజు ఉన్న ధరనే కంపెనీ పరిగణిస్తుందని మరువొద్దు.

Similar News

News January 15, 2026

ఇరాన్‌పై అమెరికా యుద్ధం?.. సిద్ధంగా డ్రోన్లు, విమానాలు!

image

అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌లో నిరసనకారులపై జరుగుతున్న హింసను అడ్డుకుంటామని హెచ్చరించిన ట్రంప్.. ఇప్పుడు ప్రత్యక్ష సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలోని US స్థావరాల నుంచి వందలాది యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఎయిర్ ట్యాంకర్లు ఇరాన్ దిశగా కదులుతున్నట్లు తెలుస్తోంది. అటు ఇరాన్ కూడా ‘ప్రతీకార దాడులు తప్పవు’ అంటూ రివర్స్ వార్నింగ్ ఇచ్చింది.

News January 15, 2026

సన్‌స్క్రీన్ కొనేటప్పుడు ఇవి చూస్తున్నారా?

image

చర్మాన్ని UV రేస్ నుంచి కాపాడే సన్‌స్క్రీన్‌లో కొన్ని పదార్థాలు కలిస్తే హానికరంగా మారతాయంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే ఆక్సిబెంజోన్, మెథాక్సీసిన్నమేట్, అవోబెంజోన్ హార్మోన్లపై ప్రభావం చూపడంతో పాటు క్యాన్సర్‌ కారకాలుగా ఉంటాయి. అందుకే సన్‌స్క్రీన్ కొనేటప్పుడు లేబుల్‌ కచ్చితంగా చెక్ చేయాలని సూచిస్తున్నారు. ✍️సన్‌స్క్రీన్ వల్ల వచ్చే లాభనష్టాల గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధకేటగిరీ<<>>కి వెళ్లండి.

News January 15, 2026

మహారాష్ట్రలో ప్రారంభమైన ‘మున్సిపల్’ పోలింగ్

image

మహారాష్ట్రలో ముంబై (BMC), పుణే సహా 29 కార్పొరేషన్లకు పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే చేతులు కలపడం, అజిత్ పవార్-శరద్ పవార్ ఏకం కావడం, ఏక్‌నాథ్ షిండే, BJP కూడా తమ పట్టు నిరూపించుకోవాలని చూస్తుండడంతో ఈ ఎన్నికలు ‘మినీ అసెంబ్లీ’ పోరును తలపిస్తున్నాయి. రేపు ఉదయం 10 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికల నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్లు పనిచేయవు.