News March 19, 2025

ఏప్రిల్ నుంచి ఎక్స్‌ట్రా చెల్లించాల్సిందే

image

దేశంలో APR నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ 4% పెంపు ప్రకటన చేయగా నిన్న టాటా మోటార్స్ కూడా 3% వరకు పెంచుతామంది. మిగతా ఆటో బ్రాండ్స్ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త రేట్లతో సేల్స్‌కు రెడీ అవుతున్నాయి. ఒకవేళ మీకు రాబోయే కొన్ని వారాల్లో కారు కొనే ఆలోచన ఉంటే ఈనెల 31లోపు తీసుకుంటే ఎక్స్‌ట్రా చెల్లింపు తప్పుతుంది. డెలివరీ తీసుకొనే రోజు ఉన్న ధరనే కంపెనీ పరిగణిస్తుందని మరువొద్దు.

Similar News

News February 15, 2026

త్రిమూర్తుల సంగమ రూపం శివలింగం

image

శివలింగం అంటే ఆకారమే కాదు. అనంత విశ్వానికి సంకేతం. ఇందులో త్రిమూర్తులు ఉంటారు. అడుగున ఉండే చతురస్రాకార బ్రహ్మ భాగం సృష్టిని, మధ్యలో ఉండే అష్టకోణాల విష్ణు భాగం(పాణిపట్టం) స్థితిని, పైన కనిపించే వృత్తాకార రుద్ర భాగం లయను సూచిస్తాయి. ఇలా ఒకే శివలింగంలో సృష్టి, స్థితి, లయకారకులు ఉండటం వల్ల దీనిని పూజించడం అంటే సమస్త బ్రహ్మాండాన్ని ఆరాధించడమే. నిరాకారుడైన పరమాత్మను ఆరాధించే అత్యున్నత రూపం ఈ శివలింగం.

News February 15, 2026

225 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>ESI <<>>కార్పొరేషన్‌లో 225 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. UPSC నిర్వహించిన కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్- 2024కు సంబంధించి ప్రతిభా సేతు పోర్టల్ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. పే స్కేల్ రూ.56,100-రూ.1,77,500 ఉంది. వెబ్‌సైట్: https://esic.gov.in

News February 15, 2026

UN రిపోర్ట్.. 3 రోజుల్లో 6,000 మంది హతం!

image

సుడాన్‌లోని డార్ఫర్‌లో గతేడాది OCTలో పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్సెస్ మారణహోమం సృష్టించాయని ఐక్యరాజ్యసమితి(UN) తాజాగా విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. RSF దాడుల్లో 3 రోజుల్లోనే (OCT 25th-27th) 6వేల మందికి పైగా మరణించారని వెల్లడించింది. RSF సైనికులు సామూహిక హత్యలు, లైంగిక హింసకు పాల్పడినట్లు తెలిపింది. సూడాన్ మిలిటరీ, RSFకి మధ్య 2023 APRలో మొదలైన ఆధిపత్య పోరు యుద్ధానికి దారితీసింది.