News September 6, 2024

85శాతం జిల్లాల్లో విపరీత వాతావరణ పరిస్థితులు: అధ్యయనం

image

దేశవ్యాప్తంగా 85శాతం జిల్లాల్లో విపరీత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని ఐపీఈ గ్లోబల్, ఇస్రీ ఇండియా చేసిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. సంప్రదాయ వరద ప్రభావిత ప్రాంతాలు కరవుతో, సంప్రదాయ కరవు ప్రాంతాలు వరదలతో అల్లాడుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. 1973 నుంచి 2023 మధ్యకాలంలో వాతావరణ పరిస్థితుల వివరాలను అధ్యయనం చేసిన మీదట గత దశాబ్దకాలంలో వాతావరణంలో విపరీత మార్పులు ఐదింతలు పెరిగాయని వెల్లడించింది.

Similar News

News November 18, 2025

హిడ్మా మృతితో అడవిలో పోరాటం అంతం!

image

హిడ్మా 200మంది మావోయిస్టులతో సరెండర్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారని నెల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అతడు ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో ఉన్నాడనే సమాచారంతో ఈ ఉదయం పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఎదురుకాల్పుల్లో హిడ్మా సహా ఆరుగురు మావోలు చనిపోయారు. గతంలో హిడ్మా.. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్ర నేతలతో ఎన్నో దాడులకు వ్యూహరచన చేశాడు. హిడ్మా మృతితో అడవిలో పోరాటం దాదాపు అంతం అయినట్లేనని సమాచారం.

News November 18, 2025

హిడ్మా మృతితో అడవిలో పోరాటం అంతం!

image

హిడ్మా 200మంది మావోయిస్టులతో సరెండర్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారని నెల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అతడు ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో ఉన్నాడనే సమాచారంతో ఈ ఉదయం పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఎదురుకాల్పుల్లో హిడ్మా సహా ఆరుగురు మావోలు చనిపోయారు. గతంలో హిడ్మా.. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్ర నేతలతో ఎన్నో దాడులకు వ్యూహరచన చేశాడు. హిడ్మా మృతితో అడవిలో పోరాటం దాదాపు అంతం అయినట్లేనని సమాచారం.

News November 18, 2025

ENCOUNTER: హిడ్మా సతీమణి రాజే సైతం మృతి

image

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, అతని భార్య రాజే అలియాస్ రాజక్క సహా ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతి చెందిన వారిలో స్టేట్ జోనల్‌ కమిటీ మెంబర్ చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని AP DGP హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. డివిజన్ కమిటీ మెంబర్‌గా ఉన్న రాజేపై రూ.50 లక్షల రివార్డు ఉంది.