News February 17, 2025

నేటి నుంచి GOVT స్కూల్ విద్యార్థులకు కంటి పరీక్షలు

image

TG: GOVT పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నేటి నుంచి కంటి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా 89,245మందికి పైగా చిన్నారులకు గత ఏడాది పరీక్షలు ముగిశాయి. వారిలో 88,676మందిలో దృష్టిలోపాలున్నాయని అధికారులు గుర్తించారు. ఇక ఈరోజు నుంచి వచ్చే నెల 5 వరకూ మూడో విడత పరీక్షలు ప్రారంభం జరగనున్నాయి. సమస్య ఎక్కువగా ఉన్న పిల్లలకు కళ్లజోళ్లను అందివ్వనున్నారు.

Similar News

News January 6, 2026

ప్రముఖ నటుడు కన్నుమూత

image

టాలీవుడ్ నటుడు సురేశ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. 3 దశాబ్దాలకు పైగా బ్యాంకింగ్ రంగంలో పని చేసిన ఆయన.. మల్టీనేషనల్ బ్యాంకుల్లో అత్యున్నత పదవుల్లో పని చేశారు. నటనపై ఆసక్తితో చిత్ర రంగంలోకి ప్రవేశించిన సురేశ్ కుమార్.. హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ భాషల్లో నటించి మెప్పించారు. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహా నటి, గోల్కొండ హైస్కూల్, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి పలు సినిమాల్లో నటించారు.

News January 6, 2026

₹19,391CR పెట్టుబడులు…11,753 ఉద్యోగాలు

image

AP: CM CBN అధ్యక్షతన జరిగిన SIPB సమావేశం 14 సంస్థలకు సంబంధించిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 11,753 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. కాగా పాలసీలను అందరికీ సమానంగా అమలుచేయాలని CBN సమావేశంలో స్పష్టం చేశారు. రానున్న కాలంలో ఉద్యాన పంటల ఉత్పత్తులు భారీగా వస్తాయని, అందుకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని చెప్పారు. స్పేస్ సిటీ కోసం 5వేల ఎకరాలు అవసరమన్నారు.

News January 6, 2026

కార్లు కొనడం తగ్గిస్తే కాలుష్యం తగ్గుతుంది: CJI

image

కాలుష్య నివారణలో ధనవంతులూ త్యాగాలు చేయాలని CJI సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ‘కార్లు స్టేటస్ సింబల్‌గా మారాయి. సైకిళ్లు మానేసి కార్లు కొనడానికి డబ్బు ఆదా చేస్తున్నారు. ధనవంతులు ఎక్కువ కార్లు కొనడం మానేస్తే కాలుష్యం తగ్గుతుంది. హై ఎండ్ కార్లకు బదులు EVలను వాడొచ్చు’ అని సూచించారు. ఢిల్లీ కాలుష్య నివారణలో AQMC విఫలమవుతోందన్నారు. టోల్ ప్లాజాల మూసివేతకు 2నెలల సమయం కావాలని కోరడాన్ని తప్పుబట్టారు.