News March 5, 2025

వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతి

image

AP: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న(85) కడప రిమ్స్‌లో మృతిచెందారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను పులివెందుల నుంచి కడప తీసుకురాగా చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయారు. రంగన్న వివేకా హత్య జరిగిన సమయంలో ఆ ఇంటికి వాచ్‌మెన్‌గా పనిచేశారు.

Similar News

News January 22, 2026

తొలిసారిగా స్వయం జనగణనకు అవకాశం

image

TG: జనగణనలో తొలిసారిగా ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకొనే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇంటింటి సర్వే ఆరంభానికి 15 రోజుల ముందు వరకు ఇందుకు అవకాశమిచ్చింది. ఈమేరకు గెజిట్ జారీచేసింది. కాగా రాష్ట్రంలో 2026 APR1 నుంచి జన గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జనగణన SEP 30 వరకు జరుగుతుందని పేర్కొంది. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి గృహ గణన చేపట్టనున్నారు.

News January 22, 2026

ఇత్తడి పూజా సామాగ్రి మెరిసిపోవాలంటే..

image

మంగళకర పూజల్లో ఇత్తడి వస్తువులది ప్రత్యేక స్థానం. కొన్ని కారణాల వల్ల వెలవెలబోయిన ఈ పాత్రలను చింతపండు గుజ్జుతో శుభ్రం చేయాలి. అందువల్ల వాటి సహజ కాంతి మళ్లీ వస్తుంది. సున్నం, ఉప్పు, వెనిగర్ మిశ్రమంతో సున్నితంగా స్క్రబ్ చేసినా మొండి మరకలు తొలగిపోతాయి. ఆ పాత్రలు మళ్లీ పుత్తడిలా మెరుస్తాయి. చివరగా వేడినీటితో కడిగి, పొడి వస్త్రంతో తుడిచి ఆరబెడితే మీ పూజా సామాగ్రి ఎల్లప్పుడూ దైవకళతో తళతళలాడుతూ ఉంటాయి.

News January 22, 2026

ఈ నెల 30న ఓటీటీలోకి ‘ధురంధర్’!

image

అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచిన ‘ధురంధర్’ త్వరలోనే ఓటీటీ అభిమానులను అలరించనుంది. ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన ధురంధర్ చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ మూవీ మొత్తం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మీరూ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారా?