News September 11, 2024
ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం ఫెసిలిటేషన్ కేంద్రాలు

AP: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపిస్తున్నారు. మరోవైపు వరద బాధితుల వాహనాలు, ఆస్తులకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సబ్ కలెక్టర్ ఆఫీసులో 29 కంపెనీలు క్లెయిమ్ల కోసం తమ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయగా బాధితులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.
Similar News
News December 3, 2025
గన్నేరువరం: ‘క్రీడల్లోనూ బాలికలు ముందుండాలి’

బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండి, అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. స్నేహిత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిమ్మాపూర్ కేజీబీవీ, గన్నేరువరం పాఠశాలలను ఆమె సందర్శించారు. అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపాలని బాలికలకు సూచించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే హెల్ప్లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు.
News December 3, 2025
గ్లోబల్ సమ్మిట్: ఖర్గేకు సీఎం రేవంత్ ఆహ్వానం

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానాలు అందజేస్తున్నారు. సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన కాసేపటి క్రితమే AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. సమ్మిట్ ఇన్విటేషన్ను అందజేశారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైనా వారు ఖర్గేతో చర్చించారు.
News December 3, 2025
‘ది రాజా సాబ్’ రన్ టైమ్ 3గంటలు ఉండనుందా?

రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ మారుతీ కాంబోలో వస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీ రన్ టైమ్పై SMలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మూవీకి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడి టికెట్ బుకింగ్ యాప్స్లో రన్ టైమ్ 3.15 గంటలు ఉన్నట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ వైరలవుతున్నాయి. భారత్లోనూ దాదాపుగా ఇదే రన్ టైమ్ ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్గా విడుదలకానుంది.


