News August 10, 2024
రేవంత్ సర్కార్ వైఫల్యం.. తగ్గిన సాగు విస్తీర్ణం: BRS

TG: వానాకాలం సీజన్ అయిపోవస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రైతుబంధు, కొత్త పంట రుణాలు ఇవ్వలేదని బీఆర్ఎస్ విమర్శించింది. ఈ కారణంగానే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గిందని ట్వీట్ చేసింది. విత్తనాలు అందుబాటులో ఉంచడంలోనూ రేవంత్ సర్కార్ వైఫల్యం చెందిందని, దీంతో పత్తి సహా ఇతర ఆరుతడి పంటల సాగు తగ్గిందని పేర్కొంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 29, 2025
గోవాడలో దాన్యం కొనుగోలు పరిశీలించిన కలెక్టర్.!

అమర్తలూరు మండలం గోవాడలోని రైతుసేవా కేంద్రంలో దాన్యం కొనుగోలు ప్రక్రియను శుక్రవారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. దళారుల మాటలు విని ధాన్యాన్ని తక్కువ రేటుకి అమ్ముకోవద్దని అన్నారు. రైతుసేవా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
News November 29, 2025
ధాన్యం కొనుగోలుకు కంట్రోల్ రూమ్: జేసీ

పశ్చిమగోదావరి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే 8121676653, 18004251291 నంబర్లలో సంప్రదించాలని కోరారు. రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
News November 29, 2025
ధాన్యం కొనుగోలుకు కంట్రోల్ రూమ్: జేసీ

పశ్చిమగోదావరి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే 8121676653, 18004251291 నంబర్లలో సంప్రదించాలని కోరారు. రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.


