News September 13, 2025
ఫేక్ ప్రచారాలకు త్వరలోనే చెక్: మంత్రి అనిత

AP: సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాల నియంత్రణకు త్వరలో చట్టం తీసుకొస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. దీనిపై సీఎం CBN కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. నిబంధనల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తోందని చెప్పారు. కొందరు విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారని, ఎక్కడ దాక్కున్నా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టం రాబోతోందని చెప్పారు. SMలో మహిళలపై వ్యక్తిత్వ హననం ఎక్కువవుతోందని వాపోయారు.
Similar News
News February 5, 2026
CCRSలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

చెన్నైలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ <
News February 5, 2026
తక్కువ నీటి నిల్వ శక్తి గల భూముల్లో దిగుబడి పెరగాలంటే?

కొన్ని భూములకు నీటిని నిల్వ చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంక మన్ను 20 శాతం కంటే తక్కువగా ఉండటమే. దీని వల్ల భూమిలో నీరు నిల్వ ఉండక, పోషకాలు మొక్కలకు అందక పంట దిగుబడి తగ్గుతుంది. ఇలాంటి భూముల్లో ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేయడం ద్వారా పై సమస్యను అధిగమించి మంచి దిగుబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News February 5, 2026
నారా రోహిత్-అల్లరి నరేశ్ కాంబోలో కామెడీ ఎంటర్టైనర్?

టాలీవుడ్లో మరో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనుంది. అల్లరి నరేశ్, నారా రోహిత్ కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్నట్లు సమాచారం. నారా రోహిత్తో ‘సుందరకాండ’ తీసిన వెంకటేశ్ నిమ్మలపూడి ఈ చిత్రానికి డైరెక్టర్గా, హరీశ్ పెద్ది నిర్మాతగా వ్యవహరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.


