News October 17, 2025
ప్రిన్సిపల్ చనిపోయారంటూ ఫేక్ లెటర్.. చివరికి

పరీక్షల వాయిదా కోసం ఇద్దరు విద్యార్థులు బరితెగించారు. MP ఇండోర్ ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కాలేజీలో BCA చదువుతున్న వారు కళాశాల లెటర్ హెడ్ సంపాదించారు. ప్రిన్సిపల్ అనామిక హఠాత్తుగా చనిపోయారని, ఈనెల 15,16న జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాసి SMలో వైరల్ చేశారు. అసలు విషయం బయటపడటంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. కాలేజీ 60రోజులు సస్పెండ్ చేసింది. ఇద్దరికీ మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది.
Similar News
News October 17, 2025
ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించండి: భట్టి

TG: BC రిజర్వేషన్లను BJPనే అడ్డుకుంటోందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. ‘దీనిపై అఖిల పక్షంతో PMను కలవాలనుకున్నాం. కానీ ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పటికీ మేం సిద్ధంగా ఉన్నాం. రామ్చందర్రావు, BJP నేతలు ఇప్పిస్తే కలుస్తాం. రేపటి బంద్ BJPకి వ్యతిరేకంగానే జరుగుతుంది. రిజర్వేషన్లపై SC తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం’ అని భట్టి అన్నారు.
News October 17, 2025
చిత్త కార్తె.. వ్యవసాయ సామెతలు

✍️ చిత్త కురిస్తే చింతలు కాయును
✍️ చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడును
✍️ చిత్తలో చల్లితే చిత్తుగా పండును
✍️ చిత్త, స్వాతుల సందు చినుకులు చాలా దట్టం
* రబీ పంటలకు చిత్త కార్తెలో పడే వానలు చాలా కీలకం. అందుకే ఆ కార్తె ప్రాధాన్యతను వెల్లడిస్తూ రైతులు ఈ సామెతలను ఉపయోగించేవారు.
* మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి.
<<-se>>#AgricultureProverbs<<>>
News October 17, 2025
ఈ స్వీట్ KGకి రూ.1.11లక్షలు

సాధారణంగా స్వీట్స్ కేజీకి రూ.2వేల వరకూ ఉండటం చూస్తుంటాం. కానీ జైపూర్ (రాజస్థాన్)లో అంజలి జైన్ తయారుచేసిన ‘స్వర్ణ ప్రసాదమ్’ స్వీట్ KG ధర ₹1.11 లక్షలు. దీనిని చిల్గోజా, కుంకుమపువ్వు, స్వర్ణ భస్మంతో తయారుచేసి బంగారం పూతతో అలంకరించారు. బంగారు భస్మం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని ఆయుర్వేదంలో ఉందని ఆమె తెలిపారు. అలాగే స్వర్ణ్ భస్మ భారత్ (₹85,000/కిలో) & చాంది భస్మ భారత్ (₹58,000/కిలో) కూడా ఉన్నాయి.