News November 30, 2024
బంగ్లా హిందువులు సేఫ్ అంటూ అక్కడి మీడియా ఫేక్ సర్వే

బంగ్లాదేశ్లో దేవాలయాలు, హిందువులపై దాడులు ఆందోళన రేకెత్తిస్తున్న వేళ చర్చను తప్పుదారి పట్టించేందుకు అక్కడి మీడియా ప్రయత్నిస్తోంది. యూనస్ ప్రభుత్వంలో మైనార్టీలు సురక్షితంగా ఉన్నట్లుగా చెబుతున్నారంటూ ఓ సర్వేను విడుదల చేశాయి. అయితే 1,000 మందిని సర్వే చేయగా అందులో 92.7 శాతం ముస్లింలే ఉండటం గమనార్హం. హిందువుల రక్షణ గురించి ముస్లింల అభిప్రాయం ఎలా ప్రతిబింబిస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


