News November 30, 2024
బంగ్లా హిందువులు సేఫ్ అంటూ అక్కడి మీడియా ఫేక్ సర్వే

బంగ్లాదేశ్లో దేవాలయాలు, హిందువులపై దాడులు ఆందోళన రేకెత్తిస్తున్న వేళ చర్చను తప్పుదారి పట్టించేందుకు అక్కడి మీడియా ప్రయత్నిస్తోంది. యూనస్ ప్రభుత్వంలో మైనార్టీలు సురక్షితంగా ఉన్నట్లుగా చెబుతున్నారంటూ ఓ సర్వేను విడుదల చేశాయి. అయితే 1,000 మందిని సర్వే చేయగా అందులో 92.7 శాతం ముస్లింలే ఉండటం గమనార్హం. హిందువుల రక్షణ గురించి ముస్లింల అభిప్రాయం ఎలా ప్రతిబింబిస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News January 20, 2026
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి

దావోస్ వేదికగా గూగుల్ ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ అధ్యక్షుడు సంజయ్ గుప్తాతో TG CM రేవంత్ భేటీ అయ్యారు. వాతావరణ మార్పులు, వ్యవసాయం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ల ప్రోత్సాహంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు గూగుల్ ఆసక్తి చూపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న CURE, PURE, RARE అభివృద్ధి ఫార్ములాను రేవంత్ వివరించారు.
News January 20, 2026
భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం

<<18887766>>WEF<<>>లో ట్రంప్ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఏడుగురు భారతీయ పారిశ్రామికవేత్తలు ఉండటం గమనార్హం. వీరిలో టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, భారతీ Airtel ఛైర్మన్ సునీల్ మిట్టల్, విప్రో CEO శ్రీనివాస్ పల్లియా, ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, బజాజ్ ఫిన్సర్వ్ ఛైర్మన్ సంజీవ్, మహీంద్రా గ్రూప్ CEO అనీష్ షా, జూబిలెంట్ గ్రూప్ కో-ఛైర్మన్ భర్తియా ఉన్నారు. ఆరేళ్ల తర్వాత ట్రంప్ WEFలో పాల్గొంటున్నారు.
News January 20, 2026
సభలో కూర్చున్నప్పుడే MPల అటెండెన్స్: స్పీకర్

లోక్సభ సభ్యుల అటెండెన్సును వారు సభలో కూర్చున్నప్పుడే తీసుకోనున్నామని స్పీకర్ ఓం బిర్లా మీడియాకు తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు హౌస్ బయట హాజరు వేసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే సభ ముగిసిన, ఏదైనా కారణంతో అర్థాంతరంగా వాయిదా పడిన తర్వాత హాజరు వేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. హాజరు నమోదుకు సభ్యుల సీట్ల వద్ద కన్సోల్ పరికరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


