News June 22, 2024
జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని తప్పుడు వార్తలు: YCP

AP: పులివెందులలో జగన్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయని కొన్ని ఛానళ్లు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని వైసీపీ తెలిపింది. ‘జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, కార్యకర్తలు ఆగ్రహించారని ఆ మీడియా పిచ్చిరాతలు రాసుకుంది. జగన్ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చిన విషయాన్ని మరుగునపరచడానికి, వక్రీకరించి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.
Similar News
News October 14, 2025
EPFO: ఆ నిబంధన ఎత్తివేత!

<<17996798>>EPFO<<>> మరిన్ని నిర్ణయాలు..
* చదువు కోసం 10, పెళ్లి విషయంలో 5సార్లు పాక్షిక విత్ డ్రా చేసుకోవచ్చు. గతంతో వీటిపై పరిమితి(3 సార్లు) ఉండేది.
* విత్ డ్రా చేయడానికి గతంలో ప్రకృతి విపత్తు, నిరుద్యోగం తదితర కారణాలు చూపాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ నిబంధన ఎత్తేశారు.
* కనీస బ్యాలెన్స్ 25% కచ్చితంగా కొనసాగించాలి. దాంతో అధిక వడ్డీ రేటు పొందే వీలుంటుంది.
* విత్ డ్రా కోసం కనీస సర్వీస్ కాలాన్ని 12 నెలలకు తగ్గించారు.
News October 14, 2025
మామిడి రైతులకు డబ్బులు విడుదల

AP: తోతాపురి మామిడి విక్రయించిన రైతులకు ప్రభుత్వం నగదు విడుదల చేసింది. 40,795 మంది రైతుల ఖాతాల్లో రూ.185.02 కోట్ల సబ్సిడీని జమ చేసింది. ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకూ ఎక్స్గ్రేషియా నిధులు రిలీజ్ చేసింది. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 19 జిల్లాల్లో 106 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5.30కోట్లు జమ చేసింది.
* రోజూ అగ్రికల్చర్ వార్తల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి..
News October 14, 2025
పూజకు పూలు లేనప్పుడు ఏం చేయాలి?

పూజ సమయంలో పూలు లేకపోతే చాలామంది వాటి బదులు అక్షింతలు కలిపి పూజ చేస్తుంటారు. అయితే పూలను అక్షింతలతో కలిపి పూజించవద్దని పండితులు చెబుతున్నారు. దీనివల్ల విఘ్నాలు వస్తాయని అంటున్నారు. ఒకవేళ ఇంట్లో ఒకటి, రెండు పూలు మాత్రమే ఉంటే.. వాటిని ముందు దేవుడి పాదాల వద్ద ఉంచి, ఆ తర్వాత అక్షింతలను సమర్పించాలి. పూలు లేనప్పుడు కేవలం అక్షింతలతో పూజ చేసినా శుభ ఫలితం దక్కుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. <<-se>>#POOJA<<>>