News April 4, 2024
ప్రముఖ కెమెరామెన్ మృతి

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఎన్నో సూపర్హిట్ సీరియల్స్కి కెమెరామెన్గా పనిచేసిన పోతన వెంకటరమణ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ మరణించారు. బుుతురాగాలు, సంసారం సాగరం, సిరి, బొమ్మరిల్లు వంటి హిట్ సీరియల్స్కి కెమెరామెన్గా పనిచేసిన ఆయన.. శ్రీ వైనతేయ అనే సీరియల్కి బెస్ట్ సినిమాటోగ్రాఫర్గా నంది అవార్డు అందుకున్నారు. ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా పలు సినిమాలకు పనిచేశారు.
Similar News
News January 25, 2026
JNCASRలో ఉద్యోగాలు

జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్(<
News January 25, 2026
సూర్యుడి రథం మనకు బోధించే పాఠాలివే..

సూర్యుని రథానికి ఒకే చక్రం ఉంటుంది. అది ఏడాది కాలానికి సంకేతం. ఆ చక్రానికి ఉన్న 6 ఆకులు 6 రుతువులను సూచిస్తాయి. రథానికి కట్టిన 7 గుర్రాలు సూర్యకాంతిలోని 7 రంగులను(VIBGYOR) సూచిస్తాయి. అలాగే మన శరీరమే ఒక రథంగా చెప్పవచ్చు. బుద్ధిని సారథిగా భావించవచ్చు. మనస్సును పగ్గాలుగా పరిగణించవచ్చు. ఈ రథాన్ని నడిపించే ఆత్మ స్వరూపం సూర్యుడు. నిరంతరం ముందుకు సాగడమే సూర్యుని గుణం. అది మన జీవన ప్రయాణానికి స్పూర్తి.
News January 25, 2026
4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం ప్రత్యేకత

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని అన్ని రకాల నేలల్లో కొద్ది నీటి వసతితో పెంచవచ్చు. ఇది ఏడాదికి 6-7 సార్లు కోతకు వస్తుంది. దీనిలో తీపిదనం ఎక్కువగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. ఎకరం గడ్డి 10 ఆవులకు సరిపోతుంది. దీనిలో ప్రొటీన్ కంటెంట్ 16-18 శాతంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ. దీని వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దీని ఆకులు మృదువుగా ఉండటం వల్ల రైతులు కోయడం కూడా సులభం.


