News May 12, 2024
స్ట్రాటజిక్ టైమ్ ఔట్ పై ఫ్యాన్స్ ఆగ్రహం

నిన్న కోల్కతాలో కేకేఆర్, ముంబై మధ్య మ్యాచ్ వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. అసలు మొదలు కావడమే ఆలస్యమైన ఆ మ్యాచ్లో మళ్లీ స్ట్రాటజిక్ టైమ్ ఔట్లను పెట్టారు. దీంతో ఐపీఎల్ నిర్వాహకులపై ఫ్యాన్స్ నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యమైన మ్యాచ్కు మళ్లీ టైమ్ ఔట్లు పెట్టి ఇంకా లేట్ చేయడం ఏం సబబంటూ ప్రశ్నించారు. ఈరోజు తెల్లవారుఝాము 12.30 గంటల వరకు మ్యాచ్ సాగడం గమనార్హం.
Similar News
News January 16, 2026
కనుమ – ముక్కనుమ: తేడాలేంటి?

నేడు కనుమ. రేపు ముక్కనుమ. ఈ పండుగలు పల్లె సంస్కృతికి అద్దం పడతాయి. కనుమ నాడు వ్యవసాయానికి చేదోడుగా నిలిచే పశువులను పూజించి కృతజ్ఞతలు తెలుపుతారు. ఇక ముక్కనుమ పండుగ ముగింపు సంబరం. ఈరోజున పశువులను చెరువులలో శుభ్రంగా కడిగి విశ్రాంతినిస్తారు. కనుమ రోజున శాకాహారానికి ప్రాధాన్యత ఉంటే, ముక్కనుమ నాడు మాంసాహార విందులు, గ్రామ దేవతల ఆరాధన, బొమ్మల నోము వంటి కార్యక్రమాలతో పండుగకు ఘనంగా ముగింపు పలుకుతారు.
News January 16, 2026
NTR ‘డ్రాగన్’ మూవీలో అనిల్ కపూర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్లోకి బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్స్టా వేదికగా ధ్రువీకరించారు. అనిల్ కపూర్ రాకతో మూవీ హైప్ అమాంతం పెరిగింది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2026లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
News January 16, 2026
ఎల్లుండి ‘మౌని అమావాస్య’.. ఏం చేయాలి?

మౌని(చొల్లంగి) అమావాస్య ఈ ఏడాది JAN 18న వచ్చింది. 18న 12.03amకి ప్రారంభమై 19న 1.21amకు ముగుస్తుంది. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పాపాలు తొలగి, మోక్షం లభిస్తుందని నమ్మకం. పితృదేవతలకు పిండ ప్రదానం చేసి నీళ్లు, నువ్వులతో తర్పణాలు వదిలితే వారు ఉత్తమ లోకాలకు చేరుకొని ఆశీర్వదిస్తారని పండితులు చెబుతున్నారు. మౌన వ్రతం, శివుడికి రుద్రాభిషేకం, నవగ్రహ ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుందట.


