News May 12, 2024
స్ట్రాటజిక్ టైమ్ ఔట్ పై ఫ్యాన్స్ ఆగ్రహం

నిన్న కోల్కతాలో కేకేఆర్, ముంబై మధ్య మ్యాచ్ వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. అసలు మొదలు కావడమే ఆలస్యమైన ఆ మ్యాచ్లో మళ్లీ స్ట్రాటజిక్ టైమ్ ఔట్లను పెట్టారు. దీంతో ఐపీఎల్ నిర్వాహకులపై ఫ్యాన్స్ నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యమైన మ్యాచ్కు మళ్లీ టైమ్ ఔట్లు పెట్టి ఇంకా లేట్ చేయడం ఏం సబబంటూ ప్రశ్నించారు. ఈరోజు తెల్లవారుఝాము 12.30 గంటల వరకు మ్యాచ్ సాగడం గమనార్హం.
Similar News
News October 26, 2025
మహిళల ఆరోగ్యానికి తోడ్పడే ప్రోబయోటిక్స్

ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాకుండా పలుఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో యూరినరీట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయంటున్నారు నిపుణులు. అలాగే పేగులోని అసమతుల్యతను సరిచేసి చర్మసమస్యలు తగ్గించడంలో, మూడ్ స్వింగ్స్, వెయిట్ మేనేజ్మెంట్లోనూ సాయపడతాయి. వీటికోసం పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోసె, అరటి,యాపిల్, ఉల్లి, వెల్లుల్లి తీసుకోవాలని సూచిస్తున్నారు.
News October 26, 2025
కొమురం భీమ్ గురించి తెలుసుకోండి: మోదీ

ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్పై PM మోదీ ప్రశంసలు కురిపించారు. ‘బ్రిటిషర్ల దోపిడీ, నిజాం దురాగతాలు పెరిగిపోయిన సమయంలో 20 ఏళ్ల యువకుడు ఎదురు నిలబడ్డాడు. తన పోరాటంలో నిజాం అధికారిని చంపి, అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. నేను మాట్లాడేది కొమురం భీమ్ గురించే. ఈ నెల 22న ఆయన జయంతి జరిగింది. ఎంతోమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన గురించి యువత తెలుసుకోవాలి’ అని మన్కీ బాత్లో పిలుపునిచ్చారు.
News October 26, 2025
KKR హెడ్ కోచ్గా అభిషేక్ నాయర్!

IPL: కోల్కతా నైట్రైడర్స్కు కొత్త హెడ్ కోచ్గా అభిషేక్ నాయర్ను నియమించనున్నట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి BCCI తొలగించాక అభిషేక్ KKR సపోర్ట్ స్టాఫ్గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన హెడ్ కోచ్గా ప్రమోట్ అవుతున్నారని ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ పేర్కొంది. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలిపింది. WPLలో UP వారియర్స్కు నాయర్ హెడ్ కోచ్గా ఉన్న విషయం తెలిసిందే.


