News November 3, 2024

వైట్‌వాష్ అవ్వడంపై ఫ్యాన్స్ అసంతృప్తి!

image

సొంతగడ్డపై సిరీస్ క్లీన్‌స్వీప్ అవ్వడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. టీ20, వన్డే మ్యాచులు ఆడే టీమ్‌తో టెస్టు ఆడిస్తే ఫలితం ఇలానే ఉంటుందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 3 టెస్టుల సిరీస్‌లో సొంతగడ్డపై భారత్ తొలిసారి క్లీన్‌స్వీప్ అయిందని, ఇది తమకు హార్ట్ బ్రేకింగ్‌గా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కోచ్ గంభీర్ వల్లేనని, టెస్టులకు ఆయన ఆలోచనలు పనికిరావంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. మీ కామెంట్?

Similar News

News December 20, 2025

ఇంట్లోనే మానిక్యూర్ చేసుకోవచ్చు

image

అందంగా, ఆరోగ్యంగా ఉండే గోళ్ల కోసం మానిక్యూర్ చేసుకోవడం తప్పనిసరి. దీన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. ముందుగా పాత నెయిల్ పాలిష్‌ని తొలగించాలి. తర్వాత గోళ్లను షేప్ చేసుకొని గోరువెచ్చటి నీటిలో షాంపూ, నిమ్మరసం కలిపి దాంట్లో చేతులు ఉంచాలి. తర్వాత చేతులను స్క్రబ్ చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చివరిగా మీకు నచ్చిన నెయిల్ పాలిష్ వేస్తే సరిపోతుంది. లేత రంగులు వేస్తే గోళ్లు సహజంగా అందంగా కనిపిస్తాయి.

News December 20, 2025

ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలివే: ICMR స్టడీ

image

భారత్‌లో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ టాప్ 3లో ఉంది. తాజాగా ICMR చేసిన స్టడీలో లేట్ మ్యారేజ్, 30 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ, 50 దాటాక మెనోపాజ్ వల్ల ఈ క్యాన్సర్ రిస్క్ పెరుగుతున్నట్లు తేలింది. పొట్ట దగ్గర ఫ్యాట్, ఫ్యామిలీ హిస్టరీ, నిద్రలేమి, స్ట్రెస్ వంటి సమస్యలు కూడా ప్రమాదాన్ని పెంచుతున్నాయి. 40 ఏళ్ల నుంచే రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని స్టడీ సూచించింది.

News December 20, 2025

జూన్‌ కల్లా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తాం: సీఎం

image

AP: జనవరి 26 నాటికి రోడ్లపై చెత్త కనిపించకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జూన్ కల్లా APని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు. ప్రజల్లోనూ సామాజిక స్పృహ రావాలని, ఇంట్లోని చెత్తను రోడ్లపై వేయొద్దని సూచించారు. అనకాపల్లి(D) తాళ్లపాలెంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో 10L గృహాలు, పట్టణాల్లో 5L ఇళ్లలో కంపోస్టు తయారీ తమ లక్ష్యమన్నారు.