News October 5, 2025
ఛార్జీల పెంపుతో జంట నగరాల ప్రజలపై కక్ష సాధింపు: కేటీఆర్

TG: ఆర్టీసీ సిటీ బస్సు ఛార్జీల పెంపుపై BRS నేత KTR ధ్వజమెత్తారు. ఒకేసారి రూ.10 పెంచడం దుర్మార్గమని, నిత్యం ప్రయాణించే వారిపై నెలకు రూ.500 వరకు అదనపు భారం పడుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరస్కరించారని జంట నగరాల ప్రజలపై ఛార్జీల పెంపుతో కక్ష సాధింపు చర్యకు దిగారని మండిపడ్డారు. ఉచిత బస్సు పథకంతో RTCని దివాళా తీయించిన ప్రభుత్వం, ఇప్పుడు ప్రయాణికుడి నడ్డి విరవాలని చూడటం క్షమించరానిదని ఫైరయ్యారు.
Similar News
News October 5, 2025
ముంచే ముప్పు.. ముందే తెలుసుకోలేమా..?

దేశంలో కొండచరియలు విరిగిపడి ఏటా వందలాది మంది చనిపోతున్నారు. ఇవాళ నేపాల్లో 51 మంది, డార్జిలింగ్లో 18 మంది బలయ్యారు. దీంతో ల్యాండ్స్లైడ్స్ ముప్పును ముందే తెలుసుకోలేమా అనే చర్చ నడుస్తోంది. వెదర్ అలర్ట్స్ వ్యవస్థల్లాగే వీటిని హెచ్చరించే సిస్టమ్ను NDMA, GSI, NLRMS అభివృద్ధి చేశాయి. సిక్కిం, కేరళ, ఉత్తరాఖండ్లో ప్రస్తుతం ట్రయల్స్లో ఉన్న సిస్టమ్ విజయవంతమైతే ముప్పు నుంచి ప్రజల్ని తప్పించవచ్చు.
News October 5, 2025
By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్కు కాల్ చేయండి!

చాలా మంది పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపిస్తుంటారు. అలాంటి సమయంలో కంగారు పడకుండా దానిని స్క్రీన్ షాట్ తీసుకోండి. గూగుల్ పేలో పంపితే 18004190157, ఫోన్పే 08068727374, పేటీఎం 01204456456, BHIMలో అయితే 18001201740 నంబర్లకు ఫోన్ చేయాలి. వారికి సమస్య గురించి చెబితే డబ్బు తిరిగి అకౌంట్కి వచ్చేలా చర్యలు తీసుకుంటారు. లేదా <
News October 5, 2025
ఎవరెస్టుపై మంచుతుఫాను.. 1000 మంది దిగ్బంధం

ఎవరెస్టుపై మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. భారీ హిమపాతం చోటు చేసుకోవడంతో టిబెట్ వైపుగా 16వేల అడుగులు ఎత్తులో 1000 మంది చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. వీరిలో కొందరు హైపోథెర్మియాతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొంది. స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అటు <<17921586>>నేపాల్లో<<>> భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.