News January 6, 2025
రైతు భరోసా: బీడు భూములు గుర్తించేందుకు సర్వే!

TG: వ్యవసాయ భూములకే రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, సాగు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు జాయింట్ సర్వే నిర్వహించనుంది. వ్యవసాయ, పంచాయతీ రాజ్, రెవెన్యూ ఆధ్వర్యంలో ఫీల్డ్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు సమాచారం. సర్వే నంబర్ల వారీగా గుట్టలు, వెంచర్ల లిస్ట్ రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలం సాగు లెక్కలను ప్రామాణికంగా తీసుకుని పథకానికి కావాల్సిన నిధులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News January 30, 2026
భారీగా పెరుగుతున్న గిగ్ కార్మికులు

దేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. వీరి సంఖ్య 2021లో 77 లక్షలు కాగా 2025కి 1.2 కోట్లకు చేరిందని సోషియో ఎకనమిక్ సర్వే-2026 పేర్కొంది. దేశ శ్రామికశక్తిలో ఇది 2%గా ఉంది. 2030 నాటికి 6.7%కి చేరుకుంటుందని అంచనా వేసింది. 52L మంది ఈ కామర్స్, లాజిస్టిక్స్ రంగాలలో పనిచేస్తున్నారు. వీరిలో 40% మంది వేతనం ₹15000 కన్నా తక్కువే. పనిగంటలూ అధికమే. గిగ్ వర్కర్ల పెరుగుదలతో UPI పేమెంట్లూ పెరుగుతున్నాయి.
News January 30, 2026
అయ్యప్ప గోల్డ్ చోరీ: నటుడిని విచారించిన SIT

శబరిమల బంగారం చోరీ కేసులో నటుడు జయరామ్ను SIT సాక్షిగా విచారించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో రిలేషన్, తన ఇంట్లో పూజలపై ప్రధానంగా ప్రశ్నించారు. తరచూ శబరికి వెళ్లే తనకు అక్కడి ఉద్యోగి పొట్టి పరిచయం ఉందని జయరామ్ గతంలో తెలిపారు. దేవాలయం మూసి ఉండే రోజుల్లో ఆభరణాలు ఇంట్లో ఉంచి పూజిస్తే మంచిదని తనతో చెప్పాడన్నారు. గతంలో జయరామ్ ఇంట్లో ఆభరణాలతో పూజలు చేసిన ఫొటోలు కలకలం సృష్టించాయి.
News January 30, 2026
జగన్ను కలిసిన చెవిరెడ్డి

AP: అక్రమ మద్యం కేసులో అరెస్టై నిన్న బెయిల్పై జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి YCP అధినేత జగన్ను కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలతో కలిసి వెళ్లి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తనతో పాటు కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని వివరించినట్లు YCP ట్వీట్ చేసింది. కాగా ఆందోళన చెందొద్దని, చట్టపరంగా ఎదుర్కొందామని జగన్ భరోసా ఇచ్చినట్లు పేర్కొంది.


