News June 26, 2024

వీరందరికీ రైతు భరోసా కట్?

image

TG: రైతు భరోసా పథకానికి అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు రైతుభరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేస్తోంది. బీడు భూములు, రోడ్లు, రియల్ వెంచర్లకూ ఈ పథకం వర్తించకూడదని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన సర్వే 10 రోజుల్లోగా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా ఇవ్వాలని కృషి చేస్తోంది.

Similar News

News October 10, 2024

TATA: పెళ్లి చేసుకోకపోవడానికి మరో కారణం..!

image

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పెళ్లి చేసుకోకుండా ఉండటానికి మరో బలమైన కారణం ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తన చిన్నప్పుడే తండ్రి నావల్ టాటా నుంచి తల్లి సోనో విడిపోయారు. తన నానమ్మ నవాజ్ బాయ్ వద్దే ఆయన పెరిగారు. కొంతకాలానికి ఆయన తల్లి రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. దీనిపై టాటాను స్కూళ్లో తోటి విద్యార్థులు అవహేళన చేసేవారు. ఆ అవమానాలే ఆయన వివాహం చేసుకునేందుకు అడ్డు వచ్చాయని అంటారు.

News October 10, 2024

నాలుక కోసుకుని దుర్గామాతకు సమర్పించిన భక్తుడు!

image

దుర్గామాతపై భక్తిని చాటుకునేందుకు ఓ వ్యక్తి అవాంఛిత చర్యకు పూనుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లా లాహర్ నగర్‌లో రతన్‌గఢ్ దేవీ ఉత్సవాల్లో రామ్ శరణ్ పాల్గొన్నాడు. అనంతరం తన నాలుకను తెగ్గోసుకుని అమ్మవారికి సమర్పించి, రక్తాన్ని అక్కడి పాత్రలో పోశాడు. ఇది చూసిన స్థానికులంతా నివ్వెరపోయారు. ఈ ఘటన తర్వాత రామ్ కాసేపు ఆలయంలోనే నిద్రించి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
– ఎవ్వరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు.

News October 10, 2024

రేపు ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ

image

రితీశ్ రాణా దర్శకత్వంలో సింహా, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మత్తు వదలరా-2’ చిత్రం రేపు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ‘మత్తు వదలరా’కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.