News June 26, 2024
వీరందరికీ రైతు భరోసా కట్?

TG: రైతు భరోసా పథకానికి అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు రైతుభరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేస్తోంది. బీడు భూములు, రోడ్లు, రియల్ వెంచర్లకూ ఈ పథకం వర్తించకూడదని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన సర్వే 10 రోజుల్లోగా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా ఇవ్వాలని కృషి చేస్తోంది.
Similar News
News December 28, 2025
నాగబాబు కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ అసంతృప్తి!

మహిళల డ్రెస్సింగ్పై <<18683153>>నాగబాబు<<>> రిలీజ్ చేసిన వీడియోపై కొందరు మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అనేక ఇష్యూలు ఉండగా అనవసరమైన విషయాలను టచ్ చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ వల్ల ప్రత్యర్థులకు టార్గెట్ అవ్వడం తప్ప ఎలాంటి లాభం లేదంటున్నారు. అయితే నాగబాబు ఎమ్మెల్సీగా, పార్టీ నేతగా కాకుండా సామాన్యుడిలా అభిప్రాయం చెప్పారని మరికొందరు అంటున్నారు. దీనిపై మీ COMMENT?
News December 28, 2025
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్ర పర్వదినాన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? మీ ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభించి, సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నారా? అయితే మీకు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ ఉత్తమమైనది. మీ పేరు, గోత్రనామాలతో జరిపించే సంకల్ప పూజ ద్వారా పాప విముక్తి పొంది, మోక్ష మార్గంలో పయనించవచ్చు. ఇప్పుడే వేదమందిర్లో మీ పూజను <
News December 28, 2025
కొత్త ఆశలు, సంకల్పంతో నూతన ఏడాదిలోకి: మోదీ

ప్రయాగ్రాజ్ కుంభమేళాతో ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచమే ఆశ్చర్యపోయిందని PM మోదీ అన్నారు. ‘ఏడాది చివర్లో అయోధ్య రామ మందిరంపై పతాకావిష్కరణతో ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండిపోయింది. ఆపరేషన్ సిందూర్ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారింది. స్వదేశీ ఉత్పత్తులపై ప్రజలు ఉత్సాహాన్ని కనబరిచారు. కొత్త ఆశలు, సంకల్పంతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు దేశం సిద్ధం’ అని ‘మన్ కీ బాత్’లో చెప్పారు.


