News January 8, 2025
26న ట్రాక్టర్ మార్చ్కి రైతుల పిలుపు

పంజాబ్-హరియాణా సరిహద్దుల్లో నిరసన చేపట్టిన రైతులు ఈనెల 26న దేశవ్యాప్త ట్రాక్టర్ మార్చ్కి పిలుపునిచ్చారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ సహా ఇతర డిమాండ్ల సాధనకు రైతులంతా మార్చ్లో పాల్గొనాలని కోరారు. కాగా రైతునేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ సరిహద్దులో తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. కేంద్రం దిగొచ్చేవరకు దీక్ష విరమించబోనని స్పష్టం చేశారు. ఆయనకు మద్దతుగా వేలాదిమంది రైతులు ఆందోళన చేస్తున్నారు.
Similar News
News November 2, 2025
వంటింటి చిట్కాలు

* బొంబాయి హల్వా రుచిగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కలపాలి.
* పచ్చి బటానీ ఉడికించేటప్పుడు కాస్త పంచదార వేస్తే వాటి రుచి పెరుగుతుంది.
* అరటికాయ చిప్స్ కరకరలాడాలంటే వేయించే ముందు వాటిపై ఉప్పు నీటిని చిలకరించాలి.
* ఫ్లవర్ వాజుల్లో నీటిని మార్చినపుడు అందులో కాస్త పంచదార వెయ్యడం వల్ల పూలు వాడిపోకుండా తాజాగా ఉంటాయి.
News November 2, 2025
జోగి రమేశ్ అనుచరుడిని వదిలేసిన పోలీసులు

AP: జోగి రమేశ్ <<18175158>>అనుచరుడు<<>> ఆరేపల్లి రామును ఎక్సైజ్ పోలీసులు వదిలిపెట్టారు. తిరిగి తాము పిలిచినప్పుడూ విచారణకు రావాలని ఆదేశించినట్లు రాము తెలిపారు. రమేశ్ సోదరుడు జోగి రాము ఇళ్లు చూపించాలని ఎక్సైజ్ అధికారులు తనను తీసుకెళ్లారని పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్తో తనకు, జోగి రమేశ్కు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని చెప్పారు. జనార్దన్కు ఫోన్ చేసి మాట్లాడేంత పరిచయం రమేశ్కు లేదన్నారు.
News November 2, 2025
MECONలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<


