News January 14, 2025
పసుపు బోర్డుతో రైతుల కల నెరవేరింది: బండి

TG: నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుతో పండగ రోజు రైతుల కల నెరవేరిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. దీని ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నట్లు చెప్పారు. ఎంపీ అర్వింద్ పట్టుదలతో తన హామీ నెరవేర్చుకున్నారని చెప్పారు. రైతుల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి రైతులు తమ ఆశీర్వాదం అందించాలని బండి కోరారు.
Similar News
News February 1, 2026
BUDGET: బడుల్లో ‘కంటెంట్ క్రియేట్’ పాఠాలు

బడ్జెట్-2026లో భాగంగా SM రంగంలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా ప్రభుత్వం ‘కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్’ను ప్రకటించింది. 2030 నాటికి 15 వేల పాఠశాలలు, 500 కళాశాలల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీడియో ఎడిటింగ్, పాడ్కాస్టింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. ఈ ల్యాబ్స్ను IICT నిర్వహిస్తుంది. నిరుద్యోగాన్ని తగ్గించి, గ్రామీణ యువత కూడా ఇంటి నుంచే సంపాదించేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
News February 1, 2026
‘డబుల్ హ్యాపీ’ కవలలు పుట్టాక RC ఫస్ట్ పోస్ట్

మెగా పవర్ స్టార్ రామ్చరణ్, ఉపాసన దంపతులకు <<19016319>>కవలలు<<>> జన్మించిన విషయం తెలిసిందే. అయితే ముందుగా బాబు, ఆ తర్వాత పాప పుట్టినట్లు వైద్యులు తెలిపారు. రామ్చరణ్ తమ సంతోషాన్ని SM ద్వారా పంచుకుంటూ తన జీవితంలోని మహిళలే తనకు కొండంత బలమని రాసుకొచ్చారు. ముగ్గురు పిల్లలు కలగడం సంతోషంగా ఉందన్నారు. తమను ఆదరిస్తున్న అభిమానులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం మెగా ఇంట పండగ వాతావరణం నెలకొంది.
News February 1, 2026
తగ్గేదేలే.. డిఫెన్స్ బడ్జెట్ పైపైకి!

మిలిటరీ ఆధునికీకరణతో కలిపి మొత్తంగా ఈసారి బడ్జెట్లో డిఫెన్స్కు కేంద్రం ₹7.85లక్షల కోట్లను కేటాయించింది. రక్షణ రంగానికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనం. పదేళ్లలో ఈ కేటాయింపులు భారీగా పెరిగాయి. 2015-16లో ఇది ₹2.94లక్షల కోట్లకే పరిమితం కాగా క్రమంగా కేంద్రం పెంచుతోంది. ఆత్మనిర్భరత సాధించేందుకు ప్రయత్నిస్తున్న భారత్ ఆపరేషన్ సిందూర్ తర్వాత డిఫెన్స్పై మరింత దృష్టిసారించింది.


