News November 26, 2024
30న మహబూబ్నగర్లో రైతు పండుగ: రేవంత్

TG: రైతుల నుంచి పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ, మద్దతు ధర, బోనస్ చెల్లించిన సందర్భంగా ఈ నెల 30వ తేదీన మహబూబ్నగర్లో రైతు పండుగను నిర్వహించనున్నట్లు CM రేవంత్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని 28, 29, 30 తేదీల్లో వ్యవసాయ ఎగ్జిబిషన్, ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, ఆదర్శ రైతులతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్లంతా రైతు పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని CM కోరారు.
Similar News
News January 20, 2026
పుత్తడి పరుగులు.. పెళ్లి చేసేదెలా?

ఫిబ్రవరి 19 నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్న తరుణంలో బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడం సామాన్యులను కలవరపెడుతోంది. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే బంగారం తప్పనిసరి కావడంతో, ఈ పెరుగుదల సామాన్య కుటుంబాలపై పెను భారంగా మారింది. పసిడి పరుగులు ఇలాగే కొనసాగితే పెళ్లిళ్ల సమయానికి 10 గ్రాముల బంగారం రూ. 2 లక్షలకు చేరుతుందేమోనన్న భయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం 24క్యారెట్ల 10gల బంగారం ధర రూ.1.52లక్షలుగా ఉంది.
News January 20, 2026
INTER EXAMS: 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

TG: ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతించనున్నారు. గతేడాది అమలు చేసిన ఈ నిబంధనలు ఈసారి కూడా కొనసాగించనున్నట్లు ఇంటర్ బోర్డ్ పేర్కొంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.
News January 20, 2026
సరిహద్దుల్లో ఉగ్ర బంకర్లు.. మ్యాగీ, బియ్యం..

J&Kలోని కిష్త్వార్లో జైషే మహ్మద్(JeM) టెర్రరిస్టుల భారీ బంకర్ను భద్రతా బలగాలు కనుగొన్నాయి. వాళ్లు నెలల తరబడి అక్కడ షెల్టర్ తీసుకున్నారని గుర్తించాయి. 50 మ్యాగీ ప్యాకెట్లు, తాజా కూరగాయలు, 15 రకాల దినుసులు, 20KGs బాస్మతి బియ్యం, గ్యాస్ స్వాధీనం చేసుకున్నాయి. జైషే కమాండర్ సైఫుల్లా అక్కడ ఉన్నట్లు భావిస్తున్నాయి. బంకర్ను తాము గుర్తించడంతో టెర్రరిస్టులు గ్రనేడ్లు విసిరి <<18892238>>పారిపోయినట్లు<<>> తెలిపాయి.


