News November 28, 2024
నేటి నుంచి ‘రైతు పండుగ’

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావొస్తున్న నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు మహబూబ్నగర్లో ‘రైతు పండుగ’ నిర్వహించనుంది. దీనిలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మేరకు 150 స్టాళ్లను ఏర్పాటు చేయనుండగా వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. ఈ నెల 30న సీఎం రేవంత్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Similar News
News December 31, 2025
VZM: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

విశాఖలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన విజయనగరం జిల్లా వ్యక్తికి స్పెషల్ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. భోగాపురం ప్రాంతానికి చెందిన నర్సింగ్ విశాఖ వన్టౌన్ పరిధిలో ఉంటున్నాడు. ఈ ఏడాది మార్చిలో అదే ప్రాంతంలో ఉంటున్న 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. నేరం రుజువు కావడంతో కోర్టు పైవిధంగా శిక్షను విధిస్తూ మంగళవారం తీర్పు నిచ్చింది.
News December 31, 2025
టోల్ మినహాయించాలని లేఖ.. BRS విమర్శలు

TG: సంక్రాంతికి HYD-విజయవాడ మార్గంలో <<18708714>>టోల్<<>> మినహాయించాలని కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాయడంపై BRS శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘తెలంగాణ ప్రజలపై ఇదే దయ ఎందుకు చూపరు. HYDలో ఉన్న తెలంగాణ బిడ్డలు వరంగల్, కరీంనగర్, ADB, మహబూబ్ నగర్, నల్గొండ వైపులకు వెళ్లేందుకు రూ.వందల టోల్ ఫీజులు కడుతున్నారుగా. దసరా, బతుకమ్మకూ ఇదే మినహాయింపు ఇవ్వండి మరి’ అని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నాయి.
News December 31, 2025
కృష్ణా జిల్లాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

AP: కృష్ణా జిల్లాలోని వైద్యఆరోగ్యశాఖలో 60 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, MLT, BSc(MLT), ఇంటర్ ఒకేషనల్ (MLT, ఫార్మసీ), DMLT, డిప్లొమా, బీఫార్మసీ, PGDCA, డిగ్రీ(కంప్యూటర్స్) అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 ఏళ్లు. వెబ్సైట్: https://krishna.ap.gov.in/


