News July 19, 2024

ఏపీలోనూ రైతు రుణమాఫీ చేయాలి: షర్మిల

image

తెలంగాణలో రైతు రుణమాఫీ చేయడాన్ని APCC చీఫ్ షర్మిల స్వాగతించారు. ‘15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే దఫాలో రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది. మళ్లీ నిన్న తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఇంకెప్పుడని వెక్కిరించిన నోళ్లు మూయించేలా రుణమాఫీ చేసింది. ఏపీలో ప్రతి రైతు తలపై సుమారు రూ.2,45,554 అప్పు ఉంది. ఏపీలోని కూటమి సర్కార్ కేంద్రం సాయంతో రుణమాఫీ చేయాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News November 20, 2025

నేడు కార్తీక అమావాస్య! ఇలా చేస్తే..

image

‘కార్తీక అమావాస్య రోజున పితృ దేవతలకు పూజ చేయాలి. దీపదానం, అన్నదానంతో ఎంతో పుణ్యం వస్తుంది. సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శివుడికి రుద్రాభిషేకం, విష్ణుమూర్తికి తులసి మాల సమర్పించడం శుభకరం. బెల్లం, నువ్వులు నైవేద్యంగా పెట్టాలి. చీమలకు పంచదార ఇస్తే శని దోషాలు పోతాయి. ఉపవాసం ఉంటే కార్తీక మాసం మొత్తం ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది’ అని పండితులు సూచిస్తున్నారు.

News November 20, 2025

ఎవ్వరూ శాశ్వతంగా ఉండలేరు: డీకే శివకుమార్

image

KPCC చీఫ్ పదవిలో శాశ్వతంగా ఉండలేనని కర్ణాటక డిప్యూటీ CM డీకే శివకుమార్ అన్నారు. ఇప్పటికే ఐదున్నరేళ్లు అయిందని, ఇతరులకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. ‘డిప్యూటీ CM అయినప్పుడే PCC చీఫ్ పదవికి రాజీనామా చేద్దామని అనుకున్నా. కానీ కొనసాగమని రాహుల్, ఖర్గే చెప్పారు. నా డ్యూటీ నేను చేశా’ అని తెలిపారు. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతంగా ఉండలేరని తెలిపారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News November 20, 2025

పోలి పాడ్యమి రోజున 30 వత్తులు ఎందుకు?

image

కార్తీక మాసంలోని 30 రోజులకు ప్రతీకగా పోలి పాడ్యమి రోజున 30 వత్తులు వెలిగిస్తారు. కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వారు, ఈ ఒక్క రోజు 30 వత్తులు వెలిగిస్తే, అన్ని రోజుల పుణ్యం లభిస్తుందని నమ్మకం. కొందరు 31 వత్తుల దీపాన్ని కూడా పెడతారు. మరికొందరు గంగాదేవిని ఆరాధిస్తూ 2, గణపతి కోసం 2 పెడతారు. అదనంగా 4 వత్తుల దీపం పెట్టేవారు కూడా ఉంటారు. ఈ నియమం ప్రకారం.. 30-35 ఎన్ని వత్తుల దీపమైనా వెలిగించవచ్చు.