News July 19, 2024
ఏపీలోనూ రైతు రుణమాఫీ చేయాలి: షర్మిల

తెలంగాణలో రైతు రుణమాఫీ చేయడాన్ని APCC చీఫ్ షర్మిల స్వాగతించారు. ‘15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే దఫాలో రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది. మళ్లీ నిన్న తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఇంకెప్పుడని వెక్కిరించిన నోళ్లు మూయించేలా రుణమాఫీ చేసింది. ఏపీలో ప్రతి రైతు తలపై సుమారు రూ.2,45,554 అప్పు ఉంది. ఏపీలోని కూటమి సర్కార్ కేంద్రం సాయంతో రుణమాఫీ చేయాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News January 28, 2026
BARCలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(<
News January 28, 2026
దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు

TG: పార్టీ ఫిరాయింపు కేసులో MLA దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఆయన ఇప్పటి వరకు విచారణకు హాజరుకాలేదు. గతంలో ఇచ్చిన నోటీసులకు కూడా రిప్లై ఇవ్వలేదు. తాజాగా ఆయనను విచారణకు పిలవాలని స్పీకర్ నిర్ణయించారు. దానం విచారణ తర్వాత SCకి స్పీకర్ రిప్లై ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు MLAలకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News January 28, 2026
డెలివరీ తర్వాత నడుంనొప్పి వస్తోందా?

కాన్పు తర్వాత చాలామంది మహిళల్లో వెన్నునొప్పి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోన్ల మార్పులు, బరువు పెరగడం వల్ల నడుంనొప్పి వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని తగ్గించుకోవాలంటే వ్యాయామం చెయ్యాలి. కూర్చొనే పొజిషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సపోర్టింగ్ బెల్టులు, హీటింగ్ ప్యాడ్ వాడడం, ఐస్ ప్యాక్ వాడటం వల్ల నడుంనొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే ఏవైనా బరువులు ఎత్తేటపుడు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


