News March 25, 2025
గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు: బొత్స

AP: చంద్రబాబు పాలనలో ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కేజీ అయినా కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు. ధర లేక చెరుకు పంటను రైతులే కాల్చుకునే పరిస్థితి ఉందన్నారు.
Similar News
News February 19, 2026
AIIMS బీబీనగర్లో ఉద్యోగాలు

బీబీనగర్లోని AIIMS 3పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా, BSc(నర్సింగ్), GNM, BSc(రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నిక్స్/EMT) అర్హతతో పాటు పనిఅనుభవం గలవారు మార్చి 1 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కు నెలకు రూ.30K, నర్సింగ్ ఆఫీసర్, టెక్నీషియన్కు రూ.40K చెల్లిస్తారు. సైట్:aiimsbibinagar.edu.in
News February 19, 2026
క్యాబేజీ సాగుకు అనుకూల నేలలు, విత్తన మోతాదు

కూరగాయల్లో అధిక ఆదాయం ఇచ్చే పంటల్లో క్యాబేజీ ఒకటి. కొద్దిపాటి నీటి సౌకర్యం ఉన్న భూముల్లో కూడా ఈ పంటను సాగుచేసి మంచి లాభాలు పొందవచ్చు. ఇసుకతో కూడిన బంక నేలలు, సారవంతమైన ఒండ్రు నేలలు ఈ పంటకు అనుకూలం. ఇక విత్తన మోతాదుకు విషయానికొస్తే ఎకరానికి సూటి రకాలు 300 గ్రా., హైబ్రిడ్ రకాలు 100-150 గ్రా. విత్తనాలు సరిపోతాయి. కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్ను కలిపి విత్తన శుద్ధిచేయాలి.
News February 19, 2026
మార్చి రెండో వారంలో TG బడ్జెట్ సమావేశాలు!

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు MAR 2వ వారంలో ఉండొచ్చని తెలుస్తోంది. ప్రీ బడ్జెట్ మీటింగ్లు ఈనెలాఖరు వరకు ఉన్నాయి. ఆ తరువాతే తుది బడ్జెట్ ఖరారు చేయాలి. MAR మొదటి వారానికి ఈ ప్రక్రియ ముగుస్తుందని ‘ఫైనాన్స్’ వర్గాల అంచనా. అదయ్యాకే అసెంబ్లీ భేటీ ఉంటుందని చెబుతున్నాయి. ఈనెల 23న క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారు. కాగా తన కుమారుడి పెళ్లి MAR 5న ఉండడంతో ఆర్థిక మంత్రి భట్టి ఆ బిజీలో ఉన్నారు.


