News March 25, 2025
గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు: బొత్స

AP: చంద్రబాబు పాలనలో ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కేజీ అయినా కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు. ధర లేక చెరుకు పంటను రైతులే కాల్చుకునే పరిస్థితి ఉందన్నారు.
Similar News
News March 2, 2026
ఖమేనీ చనిపోతే భారత్లో ఆందోళనలు ఎందుకు?

ముస్లింలలో సున్నీ, షియా శాఖలు ఉంటాయి. ప్రపంచంలో మొత్తం ముస్లిం జనాభాలో షియాలు 10-15% ఉంటారు. అందులో ఎక్కువ మంది ఇరాన్లోనే నివసిస్తున్నారు. ‘అయతుల్లా’ అనేది మత గురువు హోదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియాలు ‘అయతుల్లా’ను ఆధ్యాత్మిక గురువుగా, మతపెద్దగా భావిస్తారు. ఇజ్రాయెల్-అమెరికా కలిసి అయతుల్లా అలీ హొస్సేనీ ఖమేనీని చంపడంతో ఆ దేశాలకు వ్యతిరేకంగా షియాలు <<19279240>>నిరసనలు<<>> చేస్తున్నారు.
News March 2, 2026
గల్ఫ్లో గురితప్పిన అమెరికా ‘రక్షణ కవచం’?

తమ గడ్డపై ఉన్న US బేస్లు రక్షణ కంటే ముప్పుగానే మారుతున్నాయనే చర్చ గల్ఫ్ దేశాల్లో మొదలైంది. తాజాగా ఇరాన్ జరిపిన దాడులను US అడ్డుకోలేకపోగా.. కీలక స్థావరాలు ఇరాన్ అటాక్స్కు లక్ష్యంగా మారాయి. UAE, కువైట్, ఖతర్లపై దాడులే దీనికి నిదర్శనం. దీంతో తమ భూభాగాలను ఇతరుల ప్రతీకార వేదికలుగా మార్చొద్దని UAE పరోక్షంగా అమెరికాను కోరడం గమనార్హం.
News March 2, 2026
BJP దూకుడుకు మాజీ మావోలతో చెక్!

TG: హిందూ అజెండాతో వెళ్తున్న BJPకి మాజీ మావోయిస్టులతో చెక్ పెట్టాలని INC భావిస్తోంది. ఇటీవల వారితో CM భేటీ అవ్వడం ఇందులో భాగమేనని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామాలతో పాటు అనేక ప్రాంతాల్లో మావోయిస్టుల పట్ల సానుభూతి ఉంటుందని, వారిని ప్రోత్సహిస్తే INCకి కలసి వస్తుందని CM భావిస్తున్నారు. దీనిపై అగ్రనేత రాహుల్తో చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలో మాజీ మావోయిస్టు నేతలను ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు.


