News March 25, 2025

గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు: బొత్స

image

AP: చంద్రబాబు పాలనలో ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కేజీ అయినా కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు. ధర లేక చెరుకు పంటను రైతులే కాల్చుకునే పరిస్థితి ఉందన్నారు.

Similar News

News March 5, 2026

సీఐఏను సంప్రదించిన ఇరాన్ ఇంటెలిజెన్స్?

image

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్‌పై USతో చర్చలకు నో చెబుతున్నా అంతర్గతంగా ఇరాన్ ఇంటెలిజెన్స్ ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. US నిఘా సంస్థ సీఐఏతో చర్చలకు సుముఖత వ్యక్తం చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. ఇందుకు మరో దేశ స్పై ఏజెన్సీ మధ్యవర్తిత్వం వహిస్తోందని ఇరు దేశాల అధికారులు చెప్పినట్లు రిపోర్ట్ చెబుతోంది. అయితే తమ హైకమాండ్ ఎలా స్పందిస్తుందోనని ఏజెన్సీలు సందిగ్ధంలో ఉన్నట్లు పేర్కొంది.

News March 5, 2026

చాట్ GPTకి షాక్.. 25 లక్షల మంది యూజర్లు ఔట్!

image

చాట్ GPTకి యూజర్లు షాకిచ్చారు. 25 లక్షల మంది దాన్ని బాయ్‌కాట్ చేసినట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ శాఖలో ఏఐ మోడల్స్ వినియోగానికి OpenAI ఒప్పందం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మిలిటరీ ఆపరేషన్లలో AI వినియోగానికి మద్దతు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్లు రద్దు చేసుకుంటున్నారు. బాయ్‌కాట్ చేస్తామని వెబ్‌సైట్‌(https://quitgpt.org/)లో సంతకాలు చేస్తున్నారు.

News March 5, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 5)

image

* 1901: సినీ నటుడు ఈలపాట రఘురామయ్య జననం
* 1917: తొలితరం సినీనటి కాంచనమాల జననం
* 1920: తెలుగు కవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి జననం
* 1827: బ్యాటరీని కనుగొన్న ఇటలీ శాస్త్రవేత్త అలెస్సాండ్రో వోల్టా మరణం
* 1953: సోవియట్ యూనియన్ చీఫ్ స్టాలిన్ మరణం
* 2004: సినీ నటుడు కొంగర జగ్గయ్య మరణం (ఫొటోలో)
* 2013: సినీ నటి రాజసులోచన మరణం