News March 25, 2025

గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు: బొత్స

image

AP: చంద్రబాబు పాలనలో ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కేజీ అయినా కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు. ధర లేక చెరుకు పంటను రైతులే కాల్చుకునే పరిస్థితి ఉందన్నారు.

Similar News

News February 25, 2026

అనిల్ అంబానీ ముంబై నివాసం అటాచ్

image

మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్ ఇచ్చింది. ముంబైలోని ఆయన నివాసం ‘అబోడ్’ను అటాచ్ చేసింది. పాలిహిల్ ప్రాంతంలో ఉన్న ఈ 17 ఫ్లోర్ల లగ్జరీ భవనం విలువ రూ.3,716 కోట్లు. దీంతో ఇప్పటివరకు మొత్తం ఆస్తుల <<18184400>>జప్తు<<>> విలువ రూ.15,700 కోట్లకు చేరింది. ఈ కేసులో అనిల్ మరోసారి ఢిల్లీలోని ఈడీ ఎదుట త్వరలో హాజరుకానున్నారు. గతేడాది ఆగస్టులో ఆయన ఈడీ విచారణ ఎదుర్కొన్నారు.

News February 25, 2026

విధులకు డుమ్మా… 94 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్ల తొలగింపు

image

TG: ఓ పక్క ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో జీతాలు…మరోపక్క విధులకు డుమ్మాకొడుతూ ప్రైవేటు ప్రాక్టీసు. బోధనాసుపత్రుల్లోని ప్రొఫెసర్లు, Asst ప్రొఫెసర్ల బాగోతమిది. ఒకరో ఇద్దరో కాదు రాష్ట్రవ్యాప్తంగా 94మంది కొన్నేళ్లుగా విధులకు రావడం లేదు. వీరికి నోటీసులు జారీచేసిన ప్రభుత్వం తాజాగా అందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గైర్హాజరీ తేదీ నుంచే ఈ టెర్మినేషన్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

News February 25, 2026

8వ తరగతి బుక్‌పై వివాదం.. స్పందించిన కేంద్రం!

image

NCERT 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో కొత్తగా చేర్చిన ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశంపై <<19224324>>తీవ్ర వ్యతిరేకత<<>> రావడం తెలిసిందే. దీనిపై CJI జస్టిస్ సూర్యకాంత్ కూడా <<19234578>>అభ్యంతరం<<>> వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. వివాదాస్పదమైన అంశాలను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పాయి. అలాంటి పాఠ్యాంశాలను చేర్చాల్సింది కాదని, వాటి స్థానంలో స్ఫూర్తిదాయక అంశాలను పెట్టాల్సిందని అభిప్రాయపడ్డాయి.