News March 25, 2025
గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు: బొత్స

AP: చంద్రబాబు పాలనలో ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కేజీ అయినా కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు. ధర లేక చెరుకు పంటను రైతులే కాల్చుకునే పరిస్థితి ఉందన్నారు.
Similar News
News February 27, 2026
NHM తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

నేషనల్ హెల్త్ మిషన్(NHM) తూర్పు గోదావరి జిల్లాలో 9 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 11 వరకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(స్పీచ్&లాంగ్వేజ్ పాథాలజీ), పీజీ(చైల్డ్ సైకాలజీ, MA, MSc సైకాలజీ, ఆప్టోమెట్రీ), డెంటల్ టెక్నీషియన్ కోర్సు, GNM అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. వెబ్సైట్: https://eastgodavari.ap.gov.in
News February 27, 2026
లిక్కర్ కేసు.. తీర్పును సవాల్ చేయనున్న సీబీఐ!

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీబీఐ కేసును రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు సంస్థ తర్వాతి స్టెప్ ఏంటనేది ఆసక్తిగా మారింది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే స్కామ్లో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇందులో అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా మరికొందరు నిందితులుగా ఉన్నారు.
News February 27, 2026
టమాటా మిర్చి అ’ధర’హో.. ఒక్కరోజే రూ.10వేలు పెరిగింది

TG: టమాటా మిర్చి రకం రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. వరంగల్(D) ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఇవాళ ఈ మిర్చి క్వింటా ధర ఏకంగా రూ.50,000 పలికింది. ఈ నెల 18న క్వింటా రూ.35,000, 19న రూ.36,000, 23న రూ.37,000, 25, 26న రూ.40,000 ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇవాళ ఒక్క రోజే క్వింటాకు రూ.10,000 పెరిగింది. 9 రోజుల్లో క్వింటా టమాటా మిర్చి ధర రూ.15వేలు పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


